గత కొన్నేళ్లుగా అటు దాయాధి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలోనే ఆ దేశంతో జతకట్టి మరీ మన దేశాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు కదం తొక్కుతున్న చైనా.. ఇప్పటికే పలు పర్యాయాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్రమంగా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి.. జెండాలను పాతడం.. ఆనక అది తమ సరిహద్దని చెప్పుకునే చౌకబారు చర్యలకు దిగుతుంది. దీంతో భారత అర్మీ ఆ చర్యలను ఎప్పటికప్పుడు సమగ్రంగా ఎదుర్కోంటూనే వుంది.
ఈ క్రమంలో ఇటీవల సిక్కింలోని సరిహద్దు ప్రాంతం డోకాలాలో జరిగిన ఘటన తాలుకు వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడా అది కాస్తా వైరల్ గా మారింది. చైనా అర్మీ దుస్సాహాసాలను నెట్ జనులతో పాటు యావత్ ప్రపంచ దేశాలు ఎండగడుతున్నాయి. భారత్ భూభాగంలో చొచ్చుకు వచ్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. చైనా సైనికుల దుందుడుకు చర్యలపై భారత్ సైన్యాలు సంయమనం పాటిస్తూ నిలువరిస్తున్నాయి. అయినా చైనా సైన్యానికులు తమ భూభాగంలోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ.. వాగ్వాదానికి దిగడం, ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ వీడియోలో చైనా పీపుల్స్ ఆర్మీ సైనికులు.. భారత భూభాగంలోకి చొచ్చుకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైనికులు వారిని అడ్డుకొని.. వారించి వెనుకకు పంపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ చైనా సైనికుడు భారత ఆర్మీ అధికారులపై తన రైఫిల్ ను గురిపెట్టిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సిక్కిం సెక్టార్లోని భూటాన్ భూభాగంలో చైనా సైన్యం నిర్మిస్తున్న రోడ్డును భారత్ సహా భూటాన్ దేశాలు వ్యతిరేకిస్తున్నా.. మరింతగా దూసుకుని వచ్చి.. భారత భూభాగంలోనే రోడ్డు పనులను చేపడుతుంది డ్రాగన్. సిక్కిం వైపున్న సరిహద్దుల్లో తమ భూభాగంలో భారత జవాన్లు అడుగు పెట్టి అక్కడ రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని చైనా ఆరోపణలు చేస్తోంది. అయితే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులే మన భూభాగంలోకి ప్రవేశించి రెండు బంకర్లను ధ్వంసం చేశారన్నది భారత రక్షణ దళాల వాదన. మన వాదనలే కాదు ఏకంగా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడంతో.. చైనాపై ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more