రాజకీయ నేతల పార్టీలు పెట్టడం, వినూత్న డిమాండ్లను సాధిస్తామని చెప్పడం సాధారణమే. అందులోనూ ఎన్నికల సమయంలో ఈ డిమాండ్లకు అది అంతూ వుండదు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్ తీసుకోస్తామన్న డిమాండ్ కూడా వస్తుందని ఇప్పటికే ప్రముఖ భారత రచయితలు తమ కథలలో వ్యక్తపర్చిన విషయం తెలిసిందే. అలాంటి కొత్త వాదననే తెరపైకి తీసుకువచ్చారు మరో నాయకుడు. నాయకుడంటే మామూలు నేత కాదు ఏకంగా బీజేపి కేంద్రమంత్రి రాందాస్.
బీజేపికి చెందిన కేంద్ర మంత్రి కాబట్టి ఏదో ఒక వివాదాస్పద అంశంపై కోత్త రిజ్వేజన్ వాదనను అందుకున్నారని భావించడం సహజమే. కానీ ఈయన ఏకంగా టిమీండియా క్రికెట్ లోనే రిజర్వేషన్ దళితులకు రిజర్వేషన్ కల్పించాలని వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించాలని సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అభిప్రాయపడ్డారు. కనీసం 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆయా వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరినట్లవుతుందని వాదనను ఆయన తెరపైకి తీసుకువచ్చారు.
అంతటితో అగని కేంద్రమంత్రి ఏకంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్స్లో భాగంగా భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సైందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో(జూన్ 18న) జరిగిన ఐసీసీ చాంపియన్స్ ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరపరాజయంపాలైన తీరు తనను విస్మయానికి గురిచేసిందని, దీనిపై సమగ్రదర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాందాస్ అథావాలే అరోపిస్తున్నారు.
వడోదరలో పర్యటించినా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బలమైన టీమిండియా జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచులో చిరాకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ను 180 పరుగుల తేడాతో చిత్తుచేసిందని అయితే.. ఫైనల్స్ లో మాత్రం భారత్ 124 పరుగుల తేడాతో ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తనకే కాదు యావత్ దేశ క్రికెట్ అభిమానులకు ఈ అనుమానం కలుగుతుందని ఆయన అరోపించారు. అసలు ఇదెలా జరిగింది? మ్యాచ్ ఫిక్సైందా? దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీయాలి’ అని రాందాస్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more