బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులకు మరో కొత్త సవాల్ ఎదురయ్యింది. శిరీష, ప్రభాకర్ లది ముమ్మాటికీ సూసైడేనని పోలీసులు క్లారిటీ ఇచ్చాక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్న బంధువులు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కానీ, ఆమె భర్త సతీష్ ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. కుకునూర్ పల్లిలో శిరీషను హత్య చేశాకే హైదరాబాద్ తీసుకువచ్చి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో ఉన్నందునే శిరీష తన లొకేషన్ ని రెండు సార్లు షేర్ చేసిందని అన్నారు. ఆ రోజు తెల్లవారుజామున 1.48 గంటల తర్వాత శిరీష బతికి ఉన్నట్టు ఆధారాలేమైనా ఉంటే పోలీసు అధికారులు చూపించాలంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అంతేకాదు కుకునూరుపల్లిలో సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదని, ఆర్జే స్టూడియో దగ్గర సీసీ ఫుటేజ్ ఏమైందని ప్రశ్నించారు. శిరీషపై జరిగిన నేరాన్ని వదిలేసి, ఆమె క్యారెక్టర్ పైనే పోలీసులు ఎందుకు ఫోకస్ చేస్తున్నారని, శిరీష మరణానికి కారకులైన రాజీవ్, శ్రవణ్ నుంచి వాస్తవాలను ఎందుకు రాబట్టడం లేదని ప్రశ్నించారు.
తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనని, తమ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పొరపచ్చాలు రాలేదని తెలిపాడు. ఎన్జీవో సంస్థ ఆశ్రే ఆకృతిలో తాను పనిచేస్తుంటానని, చెవిటి, మూగ పిల్లలకు తాను వంట చేసి పెడతానని, తమకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని చెప్పాడు. తాను నెలకు పదిహేను వేల రూపాయల వరకు ఆర్జిస్తుండగా, శిరీష ఆర్జే స్డూడియోలో పార్ట్ టైం జాబ్ తోపాటు బెంగళూరుకు చెందిన గెట్ లుక్ సర్వీసెస్ అనే ఆన్ లైన్ బ్యూటీ సర్వీసెస్ లో పని చేస్తూ మొత్తంగా 40 వేల దాకా సంపాదిస్తుందని తెలిపాడు.
ఆర్జే స్టూడియోలో శిరీష చేరి సుమారు కేవలం ఆరు నెలలు అవుతుందని, శిరీష కేరక్టర్ మంచిది కాదని చూపిస్తూ పోలీసులు పక్కదారి పట్టిస్తూ కేసు నీరు గార్చే యత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించాడు. మరి దీనికి పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more