ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పిసీసీ ఛీప్ రఘువీరారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవని ప్రజలు తమ ప్రభుత్వం అందించే ఫించన్లు తీసుకోవద్దని, తాము వేసిన రోడ్లపై నడవవద్దని చెప్పడంపై ఆయన తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. పరిపాలనా పగ్గాలను ప్రజలు అందించారంటే వారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారన్న విషయాన్ని మర్చపోయారని దుయ్యబట్టారు. ప్రజలు కట్టే పన్నులు, ఇత్యాధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా భర్తీ అవుతుందని, దాని నుంచి డబ్బులు వెచ్చించి ప్రభత్వాలు సంక్షేమ పనులు చేపడుతున్నాయని విషయాన్ని అధికార తెలుగుదేశం నేతలు మర్చిపోతున్నారని అయన మండిపడ్డారు.
ప్రజాధనంతో రాష్ట్రంలోని పేదలకు ఇస్తున్న ఫించన్ డబ్బును తీసుకోవాలంటే తమకే ఓటు వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబు.. వీధి రౌడీలా మాట్లాడుతున్నారని రఘువీరా విమర్శించారు. ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నీతులు చెప్పేవారు ముందు నీతిగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తేనే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి అయ్యి కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. అన్ని ప్రయోజనాలు పొందిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఎంత కృతజ్ఞతతో ఉండాలి? అంటూ ప్రశ్నించారు. ఆయనే కృతజ్ఞతను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీలోకి రాణించి పదవిని ఇస్తే.. సొంతమామనే వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పడు ప్రజలను బెదిరింపులకు గురిచేస్తారా..? ఆని నిలదీశారు.
తూర్పు గోదావరిలో ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప చేసిన వ్యాఖ్యలను ఖండించి.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఆయన మాటలనే ఏకంగా చంద్రబాబు కూడా అన్వయించడం సమంజసం కాదని అన్నారు. బాబు తన మాటల పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. రోడ్లు ఏమైనా హెరిటేజ్ డబ్బులతో వేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీ, గిరిజనుల హక్కులను చంద్రబాబు కాల రాస్తున్నారని, మంత్రి వర్గంలో వారికి స్థానం కల్పించకపోవడం అన్యాయమని రఘువీరరెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more