మిడ్ నైట్ అఫీసులో ఏం జరిగింది. బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడానికి కారణమేంటి.. ఇప్పుడివే ప్రశ్నలు సంచలనంగా మారాయి. ఒక ఉద్యోగిని పనిచేస్తున్న కార్యాలయంలో అమెతో అర్థరాత్రి వరకు చేయించుకునే పనులేముంటాయి. కార్యాలయంలో అర్థరాత్రి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అకస్మాత్తుగా ఎందుకు ఉరివేసుకుంది. ఈ ప్రశ్నలకు యాజమాన్యమే సమాధానం చెప్పాల్సి వుంది. అసలు అఫీసు పనివేళలు పూర్తైయ్యాక బ్యూటీషన్ కమ్ హెచ్ ఆర్ గా పనిచేస్తున్న మహిళతో అర్థరాత్రి వరకు ఏం పనిచేయిస్తున్నారు. ఈ ప్రశ్నలే ఇప్పడు పోలీసులకు కూడా అర్థంకావడం లేదు.
భర్తకు ఫోన్ చేసి లేటుగా వస్తానని చెప్పిన బ్యూటిషియన్ అనంతలోకాలు ఎందుకు వెళ్లింది..? అసలు అమె మరణం వెనుక వున్న మిస్టరీ ఏమిటీ..? ఇది అమె భర్తతో పాటు బంధువులను కూడా అర్థం కని ప్రశ్న. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ లో గల అర్జే ఫోటోగ్రఫీలో శ్రీకృష్ణానగర్ లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష (28) బ్యుటీషియన్ గావిధులు నిర్వహిస్తుంది. దాంతో పాటు అమె హెచ్ అర్ గా కూడా సేవలందిస్తుంది. క్రితం రోజు రాత్రి 8–40 గంటలకు తన భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు. అఫీసులో పని వుంది కాబోలు అనుకున్న భర్త.. తన ఉద్యోగానికి వెళ్లాడు.
బేగంపేటలోని ఆశ్రయ్–ఆకృతి పాఠశాలలో కుక్ గా పనిచేసే సతీష్ చంద్ర.. ఉదయమే విధులకు హాజరవుతాడు. అలాగే అరోజు కూడా విధులకు హాజరైన అయనకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్ చేసి తన భార్య పనిచేసే అఫీసుకు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. యజమాని వల్లభనేని రాజీవ్ ను ఏమైందని ప్రశ్నించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్ కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని తెలిపారు. తన భార్య అకస్మాత్తుగా మరణించడం వెనుక అనుమానాలు వున్నా భర్త సతీష్ చంద్ర పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more