కేంద్ర ఔళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఊహించని అవమానం ఎదురైంది. ఓ యువకుడు చేసిన పనితో ఆమె షాక్ కి గురైయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్ లోని అమ్రేలీలో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యింది.
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తున్న వేళ ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరి, వందేమాతరం నినాదం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే కాస్త దూరంలో ఉండటంతో గాజులు ఆమెపై పడలేదు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె కాసేపు ఆగిపోయి, ఆ తర్వాత తన ప్రసంగం కొనసాగించారు.
యువకుడిని భండారియా గ్రామానికి చెందిన కాస్వాలా గా గుర్తించారు. తాను ఏ పార్టీకి(కాంగ్రెస్) చెందిన వాడిని కాదని, రైతు రుణమాఫీ, అన్నదాతల అప్పులు, కష్టాల గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా అలా చేశానని తెలిపాడు. ప్రజాప్రతినిధిని అవమానించిన నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ గాజులను తిరిగి అతగాడి భార్యకు కానుకగా పంపాలని స్మృతి పోలీసులకు సూచించిందంట.
కాగా, మోదీ సొంత రాష్ట్రంలో కేంద్ర మంత్రులకు అవమానం ఎదురు కావటం ఇది రెండో సారి. ఇంతకు ముందు మాన్షుక్ మందావీయాపై హర్ధిక్ పటేల్ మద్ధతు దారుడొకడు షూ విసిరిన విషయం తెలిసిందే. యువతను విద్యా వంతులుగా తీర్చి దిద్దటంతో ప్రభుత్వం విఫలమవుతోందని ఓ వ్యక్తి ఆ పని చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more