చరిత్రలో నిలిచిపోయే మహోన్నత వ్యక్తుల జ్నాపకాలను ఆయా దేశాలు పదిలంగా భద్రపరచటం చూస్తున్నాం. విప్లవకారుడు, రష్యా రాజకీయవేత్త వ్లాదిమిర్ లెనిన్ మృతి చెంది 90 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన భౌతికకాయం అలాగే భద్రపరిచారు. మ్యాసోలియంలో రసాయనాలతో ఆయన మృతదేహాన్ని పాడవకుండా చూసుకుంటున్నారు. భావితరాలకు లెనిన్ ఔనత్యం చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పనికి పూనుకున్నారు. ఇక పోప్ జాన్ పాల్ 2 అద్భుతాలు చేశారని, ఆయనకు సెయింట్ హుడ్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాక, ఆయన గొప్పతనాన్ని చాటేందుకు కూడా పార్థివ దేహాన్ని అలాగే భద్రపరిచారు. కానీ, ఓ నేరస్థుడి తలను 176 ఏళ్లుగా జాగ్రత్తగా భద్రపరిచి ఆసక్తికర చర్చకు దారితీసింది పోర్చుగల్.
డియోగొ అల్వెస్ దొంగ కమ్ సీరియల్ కిల్లర్. 1810లో గాలిసియాలో డియోగో అల్వేస్ జన్మించి, పోర్చుగల్ కి అల్వేస్ వలస వెళ్లాడు. అక్కడ పెరుగుతూ దొంగగా మారాడు. పోర్చుగల్ లోని ఓ పెద్ద కాలువ వద్ద నిలబడి అటుగా వచ్చే రైతులను దోచుకునేవాడు. ఎదురు తిరిగితే వారిని కాలువలోకి తోసేసి కిరాతకంగా చంపేవాడు. అలా మూడేళ్లలో 80 మందిని దాకా చంపి మోస్ట్ వాంటెడ్ గా వార్తల్లో, పోలీసుల హిట్ లిస్ట్ లో నిలిచాడు.
దెబ్బకు కాలువను మూసేయటంతో రైతులు అటుగా రావడం మానేశారు. లాభం లేదనుకున్న డియోగో ఇళ్లలోకి దూరి మరీ దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. చివరకు అతి కష్టం మీద అరెస్టు చేసి, 1841లో ఉరితీశారు. అసలు అతను దొంగగా ఎందుకు మారాడు? అన్న దానిపై తాము పరిశోధనలు చేస్తామని లిస్బన్ లోని మెడికల్ కాలేజీ బోధకులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వంను కోరగా, అతని తలను వారికి అప్పగించింది. కానీ, ఎన్ని పరిశోధనలు చేసినా ఫలితం రాబట్టలేకపోయారు. పోర్చుగల్ లో ఉరిశిక్ష పడిన చివరి ఖైదీ డియోగోనే, పైగా అతి కిరాతకుడు కావడంతో అతని తలను ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ లిస్బన్ భద్రపరిచి నేరస్థులకు ఓ వార్నింగ్ మెసేజ్ అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more