ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్ కు చుక్కెదురైంది. భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ఉరి విషయంలో స్టే విధిస్తూ భారత్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది. చీఫ్ జస్టిస్ రోనే అబ్రహం నేతృత్వంలోని 11 మంది న్యాయమూర్తుల బెంచ్ కాసేపటి క్రితం తీర్పు వెలువరిచింది. జాదవ్ కేసులో పాక్ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతు ఉత్తర్వులు జారీ చేసింది.
తీర్పు ఏమని ఉందంటే...
భారత్ పాక్ లు వియన్నా ఒప్పందంలో భాగేనన్న చీఫ్ జస్టిస్ అబ్రహం జాదవ్ అరెస్ట్ వివాదాస్పదమైందని వ్యాఖ్యానించాడు. ఇక ఈ విషయం తమ దేశ భద్రతకు సంబంధించిందని, న్యాయపరిధిలోకి రాదన్న పాక్ వినతిని తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించాడు. భారత్ అభ్యంతరాలు సరైనవేనన్న ఆయన తమ పౌరుడిని కాపాడుకునే హక్కు భారత్ కు ఖచ్ఛితంగా ఉంటుందని స్పష్టం చేసిన బెంచ్ అందుకోసం దౌత్య మార్గాలను అనుసరించొచ్చని సూచించింది. ఇక తమ అంతర్గత వ్యవహారంలో దౌత్యపరమైన విషయాలు వద్దనే హక్కు పాక్ కు లేదని కూడా తేల్చేస్తూ ఉరిపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.
జాదవ్ కేసు...
భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. 2016 మార్చి 3న ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ నుంచి పాక్ సైన్యం ఆయన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందని భారత్ వాదిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయనపై గూఢచారి అనే ముద్రవేయడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్ ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్థాన్లు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ తమ వాదనలు కూడా వినిపించాయి. వియన్నా వాదనను ఉల్లంఘించిందని, దౌత్యపరమైన అవకాశం ఇవ్వలేదని భారత్ వాదించగా, ముమ్మాటికీ జాదవ్ భారత గుఢాచారినే అని అయినా దేశ భద్రత అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదని వాదించింది.
వాదనలను పూర్తి పరిశీలన చేసిన న్యాయమూర్తులు ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థానంలో తీర్పు వెలువరించింది. ఒకవేళ ఇప్పటికీ పాక్ ఈ విషయంలో మరింత మొండిగా ముందుకెళ్తే మాత్రం ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించే ఆలోచనలో ఉంది. ఇక ప్రస్తుత తీర్పును అనుసరించి భారత్ కుల్ భూషణ్ జాదవ్ను భారత్ కు రప్పించే అంశంలో తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more