దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తానని చెప్పిన బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా అన్నంతపనీ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నిధులను కేజ్రీవాల్ ఎలా వాడుకున్నాడో వెల్లడిస్తూ సాక్ష్యాలతో సహా చూపించాడు. బ్లాక్ మనీని యాక్సిస్ బ్యాంకు ద్వారా వైట్ మనీగా కేజ్రీ మార్చుకున్నాడని ఆరోపించాడు. పార్టీకి రూ. 25 కోట్లు విరాళంగా వస్తే, రూ. 20 కోట్లను లెక్కలోకి చూపి, రూ. 5 కోట్లను ఆయన నొక్కేశాడని, ఇందుకు సంబంధించి పదికి పైగా స్పైరల్ బైండింగ్ చేసిన పుస్తకాలను మీడియాకు సమర్పించాడు.
మిగతా డబ్బులో రూ. 15 కోట్ల మొత్తాన్ని కూడా ఆయన స్వీయ అవసరాలకు, నేతల విదేశీ పర్యటనలకూ వాడారని తెలపాడు. ప్రతి ఖాతాకు సంబంధించిన బ్యాంకు వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఎలక్షన్ కమిషన్ తో పాటు, సీబీఐ, ఏసీబీ అధికారులకు ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. వందలాది కంపెనీల్లో కేజ్రీవాల్ కు చట్ట విరుద్ధమైన వాటాలు ఉన్నాయని, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల మొత్తాలున్నాయన్నాడు.
కేజ్రీవాల్ ప్రారంభించిన షెల్ కంపెనీల వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కేజ్రీవాల్ నీ గల్లా పట్టి జైలు కీడుస్తాను.. అంటూ మిశ్రా ఎమోషనల్ గా ప్రసగించాడు. అయితే మీడియా సమావేశం కొనసాగుతుండగానే ఈ బహిష్కృత నేత కుప్పకూలిపోయాడు. కొన్ని రోజులుగా నిరాహారదీక్ష చేస్తుండటంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోవటం మూలంగా సొమ్మసిల్లాడని వైద్యుల తెలిపారు. ప్రస్తుతం కపిల్ మిశ్రాకు నిపుణులైన డాక్టర్ల నేతృత్వంలో చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కపిల్ బీజేపీ మనిషి: ఆప్
ఇక ఈ ఆరోపణలపై స్పందించేందుకు ఆప్ సిద్ధంగా లేదు. అయితే సీనియర్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. బీజేపీ ఆడించినట్లు కపిల్ ఆడుతున్నాడని, ముమ్మాటికీ అతను వాళ్ల చేతుల్లో బొమ్మ అని చెప్పాడు. కపిల్ ను బహిష్కరించినప్పటి నుంచి విమర్శలు చేయటం, వాటిని కేజ్రీవాల్ సహా ముఖ్యఅనుచరులు కూడా ఖండించకపోవటం చూస్తూ వస్తున్నాం. మరోవైపు కపిల్ చేసిన ఆరోపణల్లో కొత్తదనం ఏం కనిపించటం లేదు. ఏడాది క్రితం పార్టీ నుంచి బహిష్కరించబడ్డ నేత నీల్ హస్లామ్ కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more