కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీపై ధిక్కరస్వరాన్ని అవలంభిస్తున్నడీఎంకే.. తమ పార్టీ అధినేత కరుణానిధి 94వ పుట్టినరోజు వేడుకలు నిర్వహణ పేరుతో జాతీయ రాజకీయ సమీకరణలను ఒక్కసారిగా మార్చివేసేందుకు వ్యూహాలను రచిస్తుంది. వచ్చే నెలలో జరగనున్న ఈ వేడుకులకు బీజేపి వ్యతిరేక పార్టీలన్నింటికీ అహ్వానం పలికిన డీఎంకే.. బీజేపికి మాత్రం అహ్వానాన్ని అందించనంటోంది. ఇందుకు ప్రధాన కారణాన్ని కూడా చెప్పేసింది. ద్రవిడ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపికి అహ్వానం ఎలా పంపుతామని ప్రశ్నించింది.
ద్రవిడ ఉద్యమాన్ని పారద్రోలడమే తమ ప్రథమ కర్తవ్యమని బీజేపి ప్రకటించింది.. ఇలాంటప్పుడు ఆ పార్టీకి ఎలా అహ్వానం పలుకుతామని వారు భావిస్తున్నారని తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, బిహార్, ఒడిశా ముఖ్యమంత్రులు సహా పలువురు ముఖ్యనేతలు హాజరవుతున్న వేడుకలకు అలాంటి పార్టీని ఆహ్వానిస్తే.. మా వేదిక అసౌకర్యంగా మారుతుందని అందుకనే వారిని అహ్వానించడం లేదని ఆయన తేల్చిచెప్పారు. డిఎంకే అహ్వానించినా.. తాము జూన్ 3న జరిగే కరుణానిధి పుట్టినరోజు వేడుకలు హాజరుకాబోమని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో తమ స్టాండ్ చాలా క్లియర్ గా వుందని, బీజేపిని కరుణానిధి జన్మదిన వేడుకలకు ఎలా అహ్వానిస్తామని స్టాలిన్ ప్రశ్నించారు.
బీజేపి వ్యతిరేక పార్టీల అధినేతలను ఈ వేడుకలకు ఆహ్వానించిన డీఎంకే.. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధికార వ్యతిరేక పార్టీలు సమావేశమవడానికి ఈ కార్యక్రమం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. యూపీలో భారీ విజయం తర్వాత బీజేపి దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిపెట్టింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తమయ్యాయి. 2019లో బీజేపిని ఎదుర్కొనేందుకు కూటమిగా ఏర్పడే దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక, తమిళనాడులో ద్రవిడ ఉద్యమం జాతీయపార్టీలకు సవాలుగా మారింది. మరి ఈ క్రమంలో డీఎంకే వ్యూహ, ప్రతివ్యూహాలతో బీజేపి అశలను చిత్తుచేస్తుందా..? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more