టెలికామ్యూనికేషన్ రంగంలో మరీ ముఖ్యంగా మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. కోట్లాది మంది వినియోగదారులను డాటా వినియోగం చేసుకునే సౌలభ్యాన్ని కల్పించడంతో పాటు.. అప్పటి వరకు వున్న చార్జీలను అమాంతంగా తగ్గించి.. డాటీ వినియోగాన్ని కూడా అత్యంత చౌకగా మార్చేసింది. జియో ఇచ్చే ఫ్రీ ఆఫర్ పోటీకి నిలువలేక మిగతా టెలికాం సంస్థలు కూడా ఫ్రీ ఆఫర్లు ప్రకటించేశాయి. జియో ఉచితం వాయిస్ కాల్స్, డాటీ వినియోగంపై మిగతా టెలికాం కంపెనీలు గగ్గోలుపెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు రిలయన్స్.
మోబైల్ రంగంలో తన సత్తాను చాటుకున్నా రిలలయన్స్ జియో తాజాగా గృహ, కార్యాలయాల కస్టమర్ల అవసరాలను టార్గెట్ గా చేసుకుని మరోసారి సంచలన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలను తమ ఖాతాదారులుగా చేసుకున్న రిలయన్స్.. తాజా ప్రకటనతో తనకు తిరుగులేదని చాటుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రత్యర్థి కంపెనీల పాత డాంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రెండు ప్లాన్స్ తో జియో ఈ సంచలన ఆఫర్ ను ప్రకటించింది.
ఇన్నాళ్లు కేవలం 4జీ స్మార్ ఫోన్ వినియోగా దారులకు మాత్రమే అందించిన సేవలు రిలయన్స్ జియోఫీతో ఇక 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్లకు కూడా అందుబాటులోకి రానుంది. జియోఫీ 2జీ, 3జీ, ల్యాప్ టాప్ లకు తమ అదునాతన 4జీ సేవలను అందించనుంది. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు చెందిన ఏదైనా డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను ఏ జియో డిజిటల్ స్టోర్ లో నైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దానికి బదులుగా జీయో పై కొత్త రూటర్ ఇస్తారు. డివైజ్ ఎక్స్చేంజ్ కు రూ.2010 విలువైన 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. జియోఫై రూటర్ పొందడానికి కస్టమర్లు రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.1999 కస్టమర్ చెల్లిస్తాడు. అతనికి రూ.2010 ఉచితంగా 4జీ డేటాను జియో ఇస్తోంది.
దాంతో పాటు 309 ప్లాన్ కింద కచ్చితంగా మొదటిసారి 408 రూపాయలతో (రూ.309+రూ.99) రీఛార్జ్ చేసుకోవాలి. 99 రూపాయల ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి. కస్టమర్లు చెల్లించిన 1999 రూపాయలను 2010 రూపాయల విలువైన 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ దాదాపు ఉచితంగా లభించనుంది. ఇక రెండో ఆఫర్ ప్రకారం రెండో ప్లాన్ కింద యూజర్లు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినవసరం లేదు. కచ్చితంగా రీఛార్జ్ చేపించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేపించుకుంటే చాలు 1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటాను మాత్రమే పొందడానికి అవకాశముంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more