25 పైసల కోసం 23 ఏళ్ల క్రితం కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే... చార్మినార్–ఫతేదర్వాజ మార్గంలో నడిచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఎం.ఎల్.అలీ అనే వ్యక్తి కండక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించేవాడు. 1993 అక్టోబర్ 27న ఆర్టీసీ ఎన్ ఫోర్స్ మెంట్ స్క్వాడ్ అధికారులు అలీ విధులు నిర్వర్తిస్తున్న బస్సులో తనిఖీలు చేశారు. ఆసమయంలో ఒక ప్రయాణికుడి నుంచి 50 పైసలు వసూలు చేసి టికెట్ ఇవ్వలేదని, అలాగే మరో ఇద్దరు మహిళలు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నా పట్టించుకోలేదని నిర్ధారించిన, అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతనిని విధుల నుంచి తొలగిస్తూ 1994 మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భాధితుడు ఈ ఉత్తర్వులను అప్పీలెట్ అథారిటీ, రివ్యూ అథారిటీ ముందు సవాల్ చేశాడు.
అయితే అవి కూడా అధికారుల చర్యలను సమర్థించడంతో 1997లో ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ ను ఆయన ఆశ్రయించాడు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసిన అలీ ఘటనపై... పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ట్రైబ్యునల్ అలీకి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. అయితే దానికి అంగీకరించని, ఆర్టీసీ యాజమాన్యం 1999లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి ట్రైబ్యునల్ ఉత్తర్వులను సమర్థిస్తూ అలీని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దానిని కూడా అంగీకరించని ఆర్టీసీ యాజమాన్యం 2009లో డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది.
దీనిని విచారించిన ద్విసభ్య బెంచ్...75 పైసల టికెట్ కోసం ప్రయాణికుడు 50 పైసలు ఇచ్చాడని, మిగిలిన 25 పైసల కోసం డిమాండ్ చేస్తూ తాను టికెట్ ఇవ్వలేదని, ఈ మధ్యలోనే స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసిందన్న కండక్టర్ వాదనను అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇద్దరు మహిళల వద్దకు వచ్చి టికెట్ ఇచ్చేలోపే స్క్వాడ్ కండక్టర్ చేతి నుంచి రిపోర్ట్ లాక్కుని, డ్రైవర్ వాదనను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టిన న్యాయస్థానం... అతనిని విధులలోకి తీసుకోవాలని, అతనికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో న్యాయస్థానం న్యాయం చేసిందని అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more