Naxalbari couple joins Mamata Banerjee’s TMC అమిత్ షాకు చుక్కలు చూపిన ‘రాజు’ దంపతులు

Snub to bjp naxalbari couple joins tmc aafter hoisting amit shah

amit shah, amit shah west bengal, naxalbari couple join tmc, trinamool congress, bjp west bengal, raju mahali, gita, tourism minister gautam deb, west bengal, west bengal news, naxalbari news, trinamool congress news, latest news

In a major embarrassment for the BJP, two party workers with whom Amit Shah had lunch last week in Naxalbari, have joined the TMC.

కమల దళపతికి చుక్కలు చూపిన ‘రాజు’ దంపతులు

Posted: 05/03/2017 05:26 PM IST
Snub to bjp naxalbari couple joins tmc aafter hoisting amit shah

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా తిష్ట వేయాలని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీవ్రంగా ప్రయత్నించిన బీజేపి అనేక అంశాలలో తృణముల్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసింది. తమకు వ్యక్తిగత పనులు చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లంచాలు ఇస్తే తీసుకున్నారని కూడా ఓ వెబ్ ఛానెల్ కోడై కూయగా, దానిని ప్రాంతీయ నుంచి జాతీయం వరకు అన్ని ఛానెళ్లు హైలెట్ చేసినా.. కొలకతాలోని అశోక్ నగర్ వద్ద నిర్మాణంలో వున్న బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలోనూ మీడియా ప్రభుత్వాన్ని తప్పబట్టినా.. శారదా, నారాదా కుంభకోణాల్లో పార్టీ ఎంపీలను కేంద్రం టార్గెట్ చేసి అరెస్టుల పర్వాలను నడిపించినా.. పశ్చిమ బెంగాల్ ప్రజల్లో మాత్రం దీదీ మమతకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని కూడా నిరూపితమైంది.

తాజాగా కూడా మమత బెనర్జీ కేంద్రం తమ ఎంపీలను టార్గెట్ చేస్తుందని వారి చుట్టూ అవినీతి చట్రాలను బనాయించి మరీ ఇబ్బందుల పాలు చేస్తుందని కూడా అరోపించారు. ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపి ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలలో కమల దళపతి అఅమిత్ షా పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరి ప్రాంతంలో పర్యటించి అక్కడున్న మహాలీ కుటుంబంలోని రాజు, గీత ఇంట్లో బోజనం కూడా చేశారు. ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే అసలు కథ మొదలైంది. వారం రోజుల క్రితం తమ అధినేతకు అన్నం పెట్టిన దంపతులు అదృశ్యమయ్యారని అటు బీజేపి నేతలు కార్యకర్తలు అందోళన చెందారు.
 
తృణముల్ కాంగ్రెస్ నేతలే వారిని కిడ్నాప్ కూడ చేశారని అరోపించడంతో పాటు ఏకంగా పోలిస్ స్టేషన్ లో పిర్యాదు కూడా చేశారు. దక్షిణ కథియాజోట్ గ్రామానికి చెందిన రాజు దంపతుల ఇంట్లో ఆమిత్ షా నేల మీద కూర్చొని అరిటాకులో అన్నం, పప్పుతో షా సంతృప్తిగా బోజనం చేయడాన్ని జీర్ణంచుకోలేని తృణముల్ కాంగ్రెస్ వారికి హాని కలిగించే నిర్ణయాన్ని తీసుకుందని అరోపించారు. అమిత్ షా పర్యటన తర్వాత రాజు కుటుంబాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారని... వారి నుంచి రాజు కుటుంబసభ్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని బీజేపీ నేత దిలీప్ బరుయ్ మీడియాకు తెలిపారు. తృణమూల్ నేతలే రాజు దంపతులను కిడ్నాప్ చేసి ఉంటారని ఆయన ఆరోపించారు.   

అయితే కమల దళపతికి అమిత్ షా కు రాజు దంపతులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లో మమత మంత్రాంగం దెబ్బతో అమిత్ షాకు ఊహించని పరిణామాం ఎదురైందీ
తన పర్యటన సందర్బంగా నక్సల్ బరి ప్రాంతంలో రాజు దంపతుల ఇంట్లో అరిటాకులో బోజనం చేసిన అమిత్ షాకు అ దంపతులు షాక్ ఇచ్చారు. బీజేపి నేతలు, కార్యకర్తలు అరోపిస్తున్నట్లు తాము ఎక్కడికీ పోలేదని, తమనెవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసిన దంపతలు.. తాము తృణముల్ కాంగ్రెస్ తీర్థం తీసుకున్నామని కుండబద్దలు కోట్టిమరీ చెప్పారు. మమతా బెనర్జీ అంతే తమకు అమితమైన ప్రేమని అందకనే దీదీ పార్టీలో చేరామని వారు తెలిపారు. అయితే వీరిని బీజేపి నుంచి తమ పార్టీలోకి అకర్షించేందుకు బెంగాల్ పర్యాటక శాఖ మంత్రి గౌతమ్ దేబ్ పూర్తి మంత్రాంగాన్ని నడిపారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  naxalbari couple  raju mahali  gita  mamata banerjee  gautam deb  west bengal  

Other Articles