చట్టపసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇటీవల కొంత వివాదాస్పద వైఖరితో వార్తల్లో నిలుస్తున్న ఘటనలు చూస్తున్న తరుణంలో.. తాను మాత్రం ఎవరికీ ఎం తక్కువ తినలేదని అంటోంది ఈ అధికార బీజేపి ఎంపీ. ఎయిరిండియా విమానం వివాదంలో యావత్ దేశ ప్రజలకు సుపరిచితుడైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. ఆ తరువాత తన నియోజకవర్గంలోని లాతూర్ ఏటీయంలో డబ్బులు పెట్టకపోవడం.. ఏకంగా ఏటీయం కేంద్రాన్ని మూసివేయడంతో అగ్రహించి ధర్నా నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులతో ఆయన వాదనకు దిగిన విషయం చర్చనీయాంశంగా కూడా మారింది.
అయితే సరిగ్గా గైక్వాడ్ మాదిరిగానే ఉత్తర్ ప్రదేశ్ బారబాంకీకి చెందిన బీజేపి ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ కూడా ఓ పోలీసు అధికారిపై మండిపడ్డారు. అలాఇలా కాదు ఏకంగా అమె అతనిపై ఒంటికాలిపై లేచారు. సాధారణంగా కాకుండా ఏకంగా పోలీసు అధికారికి బీజేపీ ఎంపీ బహిరంగంగా హెచ్చరికలు చేశారు. చర్మం వలిచేస్తానంటూ నేరుగా మీడియా కెమెరా ముందుకొచ్చి తీవ్ర హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా ఆ పోలీసు అధికారి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా చాలా తప్పుడుగా ప్రవర్తించాడని మీడియా ముందు అరోపించారు. అతడి ప్రవర్తన ఏమాత్రం బాగ లేదని మండిపడ్డారు.
పోలీసు అధికారి తన వ్యవహారశైలిని మార్చుకోకపోతే తన అక్రమాస్తుల చిట్టాను బయటపెట్టించి మరీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. బతికుండగానే తన చర్మం వలిచేస్తా అంటూ గ్యానాంజయ్ సింగ్ అనే పోలీసును మీడియా ముందు నిల్చొని హెచ్చిరించారు. ‘కేంద్రంలో మనకు ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఉన్నారని.. వీరి హయాంలో పనిచేసేవారు మాత్రమే జిల్లాలో వుండాలని.. కాదనుకున్నవారు ఏకంగా తమ ఉద్యోగాలను బదిలీ చేయించుకుని వెళ్లాలని అమె అదేశాలు జారీచేశారు. అధికారుల ప్రవర్తన మారకుంటే మాత్రం కఠినమైన చర్యలు తప్పవని ప్రియాంక రావత్ హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more