దేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్ వైభవం దిశగా అడుగులేయ్యాలంటే తాను చెప్పిన విషయాలను తప్పక ఆచరించాల్సిందేనని అంటున్నారు ఢి్ల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్. ఈ విషయంలో తన పలుకు అంబ పలుకేనంటున్నారు. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమె.. తన విజయసూత్రాలను మాత్రం ఏకంగా మీడియా ముఖంగా చెప్పడంలో ఆంతర్యమేమిటో.. అసలు ఈ విషయాలను ఎవరు పలికిస్తున్నారన్నది మాత్రం తెలియడం లేదన్నది కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలోనే అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ అమె తన అసహనాన్ని ప్రదర్శిస్తూ.. సోనియా గాంధీ మాదిరిగా రాహుల్ కూడా ప్రతి రోజు తన కార్యాలయంలో రెండు నుంచి మూడు గంటల సమాయాన్ని కేటాయించి పార్టీ నేతలతో చర్చిస్తే పార్టీ గాడిన పడటం ఖాయమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎక్కడెక్కడో గడిపితే సరిపోదని... పార్టీ కార్యాలయంలో అందరికీ అనునిత్యం కొన్ని గంటలైనా అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు. ఈ విధంగా చేసే సోనియాగాంధీ పార్టీని పదేళ్ల పాటు అధికారంలో కి తీసుకొచ్చిన విషయాన్ని అమె గుర్తు చేశారు.
సోనియాగాంధీ పార్టీ పగ్గాలను చేపట్టినప్పుడు ప్రతి రోజు ఉదయం కనీసం రెండు మూడు గంటలు పార్టీ కార్యాలయంలో గడిపేవారని... ఇప్పుడు రాహుల్ కూడా ఇదే చేయాలని ఆమె అన్నారు. లేకపోతే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అయితే, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం పొందుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని... వాటిలో కొన్ని ఆయనకు వారసత్వంగా సంక్రమించాయని చెప్పారు. ప్రతి రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి, కొన్ని గంటల పాటు పార్టీ వర్కర్స్ తో గడిపితే అంతా సర్దుకుంటుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more