పెళ్లంటే నూరేళ్ల పంట.. రెండు జీవితాల మద్య పెనవేసుకున్న అత్మీయ అనురాగ బంధం.. మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యే జంట.. మూడు తరాలకు పునాదులుగా నిలవాలని బావిస్తుంటారు పెద్దలు మనవలు, మనవరాళ్లుతో సుఖసంతోషంగా వుండాలని దాని అర్థమంటారు. అయితే ఈ బంధం కొనాసాగింపులో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా.. వాటిని ఒకరికొకరు అండగా నిలుస్తూ పరిష్కారించుకుంటూ ముందుకు సాగుతారు.
తమ అనుభవాలను తమవారితో చివరి దశలో పంచుకుంటూ హాయిగా తమ సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. చివరకు ఈ 50 వసంతాల ప్రయాణంలో ఎవరినెవరు కోల్పోయినా.. అక్కడి నుంచే మరోకరి అంపశయ్యపైకి చేరుకుంటారు. ఇది భారతీయ వివాహానికి వున్న బలం.. అ బలాన్ని నడిపిస్తున్న బంధం. ఈ బంధంతో రెండు జీవితాలు ఒక్కటే క్రమంలో ఇరు కటుంబాలు ఒక పండుగలా జరుపుకుంటాయి. తమ తాహత్తుకు సరిపోయే విధంగా అంగరంగ వైభవంగా వేడుకను జరిస్తారు. అయితే గుజరాత్ లోని ఈ యువకుడు మాత్రం కొంచెం భిన్నం.
ఎవరైనా అనుకోని పరిస్థితుల మధ్య తమ జీవిత భాగస్వామితో విడిపోవాల్సి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లో దానిని విషాదంగానే భావిస్తారు. కానీ గుజారాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రింకేష్ రచచ్చ అనే యువకుడు మాత్రం తన విడాకులు రావడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. న్యాయస్థానం తనకు విడాకులను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏకంగా అత్యంత ఖరీదైన కాజు బర్ఫీ స్వీట్లను పంచి మరీ తన వివాహం నుంచి విముక్తి పోందిన అనందాన్ని పంచుకున్నాడు.
తనకు వివాహమైన ఏడాదికి తన జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేధాలు అత్యంత ఘోరంగా వున్నాయని, నరకాన్ని చవిచూశానని రింకేష్ తెలిపాడు. కాగా, రెండేళ్ల న్యాయపోరాటం తరువాత తనకు విడాకులు మంజూరు కావడం పట్లు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లను పంచుతున్నానని చెప్పాడు. అయితే తనకు విడాకులు మంజూరు కావడం పట్లు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారని వారిలో చాలా మంది తనకు ఎలా విడాకులు వచ్చాయన్న విషయమై అడిగారని అన్నారు. అయితే వారిలో చాలా మంది అత్తలే వున్నారని.. వారి కోడళ్లతో నరకం చూస్తున్నామని వారు తనకు చెప్పారని రింకేష్ తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more