తెలంగాణలో పార్టీ పై మళ్లీ దృష్టిసారించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికల సంకేతాలతో హడావుడిగా జరిగిన ఈ భేటీలో అధికార పక్షాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడాలంటూ పిలుపునిచ్చాడు. అదే సమయంలో బీజేపీతో పొత్తు, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇలా భేటీ అయ్యిందో లేదో అధినేత ఆజ్నలను శిరసావహిస్తూ టీ తమ్ముళ్లు గులాబీ గూటిపై మాటల దాడికి దిగిపోయారు.
టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రావు కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డాడు. కొద్దికాలంగా తమను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో హరీశ్ ఓ చచ్చిన పాము అంటూ ఘాటు కౌంటరే ఇచ్చాడు. అధికార పక్షంలో సీఎం కొడుకు కేటీఆర్ - కూతురు కవిత హవా పెరిగిపోయిందని, హరీశ్ ను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పాడు. ఇంటి పోరుతో పాటు ఎన్నో సమస్యలతో బాధపడుతున్న సిద్ధిపేట్ ఎమ్మెల్యేకు, టీడీపీని విమర్శించే అర్హత లేకపోయినా ఊరట చెందేందుకే ఇలా చేస్తున్నాడని ఎద్దేశా చేశాడు.
ఇక మిత్రపక్షమైన బీజేపీతో తెలంగాణలో కలిసి సాగడంపై వెలువడుతున్న అనుమానాలకు రావుల క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో ఇప్పటికైతే కలిసున్నామని పేర్కొంటూ వచ్చే ఎన్నికల పొత్తుల విషయం ఇప్పుడే చెప్పలేమని అది ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయమని రావుల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. మే 10 నుంచి 20 వరకు తెలంగాణాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని రావుల తెలిపారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని దీనికి సంబంధించి తీర్మానాలు చేస్తామని వైజాగ్ మహానాడులో చేస్తామని వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more