జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విస్తరణను, నియామకాలను విద్యార్థుల పరీక్షలు ముగిసిన తర్వాత చేపడతానని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ స్వయంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించబోతుంది. మొదటి దశలో అనంతపురంను ఎంచుకున్న ఆ పార్టీ ఈ నెల 21న నియామకం చేపట్టనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
పవన్ సంతకంతో ఉన్న ఓ నోట్ లో ఇలా ఉంది. ‘‘రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువకులు - మేధావులను భాగస్వామ్యుల్ని చేసే ఒక అభ్యుదయ ప్రయత్నానికి ఈనెల 21న అనంతపురంలో జనసేన శ్రీకారం చుడుతోంది. రాజకీయాల్లో అనువంశిక - ఆత్రిత పక్షపాత అవలక్షణాలను తుంచివేసి కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించడానికి తలపెట్టిన ఈ క్రతువును అత్యంత పవిత్రంగా శ్రద్ధతో జరపాలని జనసేన కృతనిశ్చయంతో ఉంది. 3600 ధరఖాస్తులు రావడంతో మూడు రోజులపాటు అర్హత పరీక్ష జరపాలని నిర్ణయించాము’’ అని ఉంది.
జనసేనకు చెడ్డ పేరు తేవాలని తలచేవారు ఈ పవిత్ర యజ్ఞంలో చొరబడకుండా జనసైనికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎంపికలు అత్యంత పారదర్శకంగా ప్రతిభకు పట్టం కట్టేవిధంగా జరుగుతాయి అని పవన్ అందులో వివరించాడు. చిరునామా: జి.ఆర్.గార్డెన్స్ గొంగడి రామప్ప కాంపౌండ్ 3వ రోడ్ ఎక్స్ టెన్షన్ ఈస్ట్ గేటు అనంతపుర 515004. ఎంపిక సమయం మిగిలిన వివరాలను దరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారని తెలిపింది. janaSenaparty.org/antpresourcepersons.pdf లేదా జనసేన ఫేస్ బుక్ ద్వారా కూడ వివరాలు తెలుసుకోవచ్చు.
మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా, తనతో కలిసి వచ్చే వారిని, నిజాయితీ పరులనే ఎంపిక చేసుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు స్పష్టమౌతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more