భారతీయ తపాలా శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా విడతల వారీగా రిక్రూట్ మెంట్ జరుగుతుండగా, ఈ ప్రక్రియ గత నెల 18 నుంచి ప్రారంభమైందని పోస్టల్ అధికారులు తెలిపారు. పదో తరగతి, ఇంటర్తో పాటు డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులు వాటికి అర్హులని తెలిపారు. దీంతో ఈ శాఖ. ఖాళీగా ఉన్న గ్రామీణ సడక్ సేవక్, మెయిల్ డెలివరీ, మెయిల్ క్యారియర్స్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్టు హైదరాబాద్ నార్త్ సౌత్ డివిజన్ అసిస్టెంట్ బుర్రి శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్ నార్త్, సౌత్ డివిజన్లలో 11 ఖాళీలు ఉన్నాయని, ఆయా పోస్టులకు 18 నుంచి 40 ఏళ్లున్న వాళ్లు ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల వయో పరిమితి సడ లింపు ఉంటుందని తెలిపారు. ఓసీ, ఓబీసీ పురుష అభ్యర్థు లు వంద రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాలన్నా రు. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చెల్లించా ల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 19వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక విధానం కూడా ఆన్లైన్లోనే ఉంటుందని, పూర్తి వివరాలకు WWW.AP.POST.IN/GDS లేదా indiapost.gov.in ఆన్లైన్ వెబ్సైట్లో చూడాలన్నారు.
గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుకు అర్హతలు
* 18-40 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు అర్హులు..
* రాష్ట్ర ప్రభుత్వం / కేంద్ర ప్రభుత్వం ఆమోదం స్టేట్ బోర్డ్ నుండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
* తగిన కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.. గుర్తింపు పోందిన సంస్థ నుంచి కనీసం 60 రోజులు ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ సర్టిఫికేట్ వుండాలి
* గ్రామీణ డాక్ సేవక్ గా ఎంపికైన తరువాత ఆ శాఖ పోస్టాఫీసు పరిధిలోనే నివాసం వుండాలి.
* ఎంపికైన వారికి ఏ ఇతర వ్యాపారం కానీ ఏజెన్సీ కానీ వుండారదు.
* రూ. 25 వేల పూచికత్తుతో పాటు రూ. పదివేల ఇతరాత్రలకు ఢిపాజిట్ చేయాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more