సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మళ్లీ చర్చ మొదలైంది. తనకు రాజకీయాలు ఇష్టం లేదు ముర్రో అంటున్నా సరే అభిమానుల నుంచి ఒత్తిడి మాత్రం తీవ్రంగా వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన సోదరుడు సత్యనారాయణ జయలలిత మరణం అనంతరం రజనీ పొలిటికల్ ఎంట్రీకి సరైన సమయం అని వ్యాఖ్యానించిన తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువైంది. దీనికి తోడు మధ్యమధ్యలో చిదంబరం, పలువురు బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరపటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆయన త్వరలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు చెన్నైలో సీరియస్ డిస్కషన్ జరుగుతోంది.
తన అభిమానులంతా ఏప్రిల్ 2న చెన్నై రావాలని ఆహ్వానిస్తూ రజనీ పేరిట లేఖలు వెలువడటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ సమావేశం అనంతరం రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ శూన్యత రాజ్యమేలుతున్న నేపథ్యంలో తలైవా ఎంట్రీకి ఇది కరెక్ట్ టైమని వారు కూడా సూచిస్తున్నారు.
రీసెంట్ గా శ్రీలంకలో తమిళులను కలవవద్దంటూ పలు పార్టీలు సూచించిన నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకుని, బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తానసలు జాలర్ల సమస్యలపై అధ్యక్షుడితో చర్చిద్దామనకుకున్నానని తెలపటం, ఆపై సరైన సమయంలో కలుద్దామని పేర్కొంటూ శ్రీలంక తమిళీయులకు ఓ లేఖ రాయటంతో రాజకీయ ట్రయల్స్ మొదలుపెట్టాడా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఈ మధ్యే కమల హాసన్ కూడా తన అభిమానులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే రజనీ లేఖలపై ఎక్కడా అధికార ప్రకటన లేఖపోవటం, పైగా పోస్టర్లు కూడా వెలియటంతో అది అభిమానుల పనే అని తర్వాత రజనీ పబ్లిసిస్ట్ రిజాయ్ అహ్మద్ వెల్లడించాడు. ఏదీ ఏమైనా హఠాత్తుగా తీసుకున్నాడని వచ్చిన వార్తపై అభిమానుల్లో ఆనందం, పార్టీల్లో కలవరపాటు మొదలైందనే చెప్పొచ్చు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more