ప్రస్తుతం ట్రెండ్ ను ఫాలో అవుతున్న మన నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఊపిరి సలపని షెడ్యూల్ తో బిజీగా ఉంటున్న నేతలు ఒకానోక దశలో వాటి ఆధారంగానే ప్రజా సమస్యలను పరిష్కారించటం హర్షనీయంగా మారింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ లాంటి నేతలైతే ఏకంగా అందులోని సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. తెలంగాణ విషయానికొస్తే ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆ విషయంలో ముందున్నాడు.
ఆ మధ్య చిన్నారుల బడి బతుకులపై కదిలించే ట్వీట్ వేసిన కేటీఆర్, తాజాగా మరో దానిపై స్పందించాడు. ప్రజలతో మమేకం అవ్వాల్సిన పోలీసులు వారిపట్ల అతిగా ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడటమే కాదు ఏకంగా పోలీస్ బాస్ కు ఫిర్యాదు కూడా చేశాడు. విషయం ఏంటంటే... ఈ మధ్య ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతంలో ఓ ట్రాఫిక్ పోలీస్ పుచ్చ కాయల వ్యాపారిపై దౌర్జన్యం చేశాడు. రోడ్డు పక్కన అమ్ముకోవటానికి వీల్లేదంటూ వాటిని విసిరికొట్టాడు. అటుగా వెళ్తున్న కొందరు ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీశారు.
@TelanganaDGP garu,Request you to take corrective action. Counselling for junior officers who have direct interface with people is essential https://t.co/JsYSY8MBj4
— KTR (@KTRTRS) March 21, 2017
వెంటనే అవి ట్విట్టర్ లో దర్శనమివ్వగా మరికొందరువ వాటిని కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. సరైన సదుపాయాలు లేని షాపింగ్ మాల్ లలో కూడా వాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ ఓ వ్యక్తి వేసిన ట్వీట్ మంత్రికి చేరింది. అంతే వెంటనే ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లటమే కాదు చర్యలను తీసుకోవాలని కోరాడు. అంతేకాదు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట జనాలకు భరోసా ఇవ్వాల్సిన వారు ఇలా ప్రవర్తించటం సరికాదని, ఈ విషయంలో కింది స్థాయి అధికారులకు కౌన్సిలింగ్ ఇవ్వండంటూ అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more