ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు ఎమ్మెల్సీని టీడీపీ కైవసం చేసుకుంది. కౌంటింగ్ ప్రారంభమైన 50 నిమిషాల్లోనే ఫలితాలు వెలువడటం విశేషం. స్థానిక సంస్థల కోటాలో బాగంగా జరిగిన ఓ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డిపై ఆయన 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ముగియగా అధికారులు వాకాటి విజయాన్ని ధ్రువీకరించారు.
కాగా, వాస్తవానికి నెల్లూరు పరిధిలో వైకాపా ఓటు బ్యాకింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పార్టీ ఫిరాయించడం లాంటి పరిణామాలు టీడీపీకి బాగా కలిసొచ్చాయి. మొత్తం 852 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 851 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిల్లో వాకాటికి 462, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డికి 377 ఓట్లు పోల్ కాగా, మరో 2 ఓట్లు చెల్లలేదు. దీంతో 85 ఓట్ల మెజారిటీతో వాకాటి విజయం సాధించినట్లయ్యింది.
మిగిలింది కడప, కర్నూలు..
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. వైకపా తరపున వైఎస్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కన్నా ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఫిరాయింపుల అనంతరం తెలుగుదేశానికి బలం ఉన్నప్పటికీ, క్రాస్ ఓటింగ్ తమను గట్టెక్కిస్తుందని వైకాపా నమ్ముతూ వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబానికి కంచుకోటలా ఉన్న కడప ప్రాంతంలో ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగగా, ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు సైతం క్రాస్ ఓటింగ్ జరిగినట్టు సూచిస్తున్నాయి. ఇక కర్నూలు విషయానికి వస్తే, తెలుగుదేశం అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 30 ఓట్ల ఆధిక్యంలో ఉండి, అక్కడ పాగా వేసేందుకు సిద్ధమైపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more