మెడిసిన్ విద్యను అభ్యసించేందుకు ఒకే దేశం ఒకే విధాననాన్ని తీసుకువచ్చిన కేంద్రం తాజాగా.. ఇంజనీరింగ్ విద్యాభ్యాసంలోనూ అదే విధానాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోనుంది. మెడిసన్ విధ్యలో నీట్ పేరిట దేశవ్యాప్తంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లుగానే ఇకపై ఇంటనీరింగ్ కోర్సులకు కూడా అలాంటిదే దేశవ్యాప్తంగా ఒకే విధమైన కామన్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుని సంబంధిత శాఖలను అదేశించింది.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ). వచ్చే ఏడాది నుంచే ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను ప్రవేశపెట్టాలని ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఏఐసీటీఈ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్ ద్వారా అడ్మిషన్లు చేపడుతుంటే..కొన్ని రాష్ట్రాల్లో సొంతంగా పరీక్షను నిర్వహించి ప్రవేశాలు చేపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ద్వారా అడ్మిషన్స్ చేపడుతున్నారు.
జాతీయ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీతో పాటు కేంద్ర సహకారంతో నడిచే విద్యాసంస్థలు జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఐఐటీల్లో మాత్రం జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా అడ్మిషన్స్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్తో అంటే జేఈఈ మెయిన్ స్కోరు ఆధారంగా అన్ని కాలేజీలకు ప్రవేశాలు చేపట్టాలని ఏఐసీటీఈ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేంద్రం నుంచి ఆమోదం లభించగానే వచ్చే ఏడాది నుంచే అంటే 2018-19 విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనుంది. ఒకవేళ కేంద్రం ఈ తరహా పరీక్షకు ఓకే చెబితే భవిష్యత్తులో ఎంసెట్ ఎగ్జామ్ స్థానంలో ఇక దేశవ్యాప్త కామన్ పరీక్ష వచ్చేయనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more