ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపోందిన బీజేపి.. మాటలకు చేతలకు అసలు పొంతన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. మైనారిటీలను విస్మరించి.. సమగ్రాభివృద్ది సాధిస్తామని ఎలా ప్రకటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంపై పీ చిదంబరం సూటి ప్రశ్నాస్త్రాలు సంధించారు. దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, అట్టడుగు వర్గాలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని ప్రస్తావించిన ఆయన తమ పార్టీ తరపున ముస్లిం మైనారిటీలకు అసలు టికెట్లే ఇవ్వకుండా చేసి,, ఆయా వర్గాల రాజకీయ విసాకాసానికి ఎలా దోహదపడతారిని ఆయన ప్రశ్నించారు. బీజేపి అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ.. 19.3శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఈ విజయాన్ని ఎలా సాధించిందని అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో ’సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న నినాదానికి సరికొత్త సంకుచిత అర్థం ఇచ్చినట్టు అయిందని ఆయన దుయ్యబట్టారు.
ఒక జాతీయ పార్టీ అసలు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం, లేదా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేయబడిన స్థానాల్లో అసలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడంతో బీజేపి ఉత్తర్ ప్రదేశ్లో బీజేపి స్ట్రాటజీని సరిపోల్చాతూ చిదంబరం బీజేపీ తీరును తప్పుబట్టారు. న్నైలో హిందూ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీలో నిర్వహించిన ’నిరంతరాయ వృద్ధిని భారత్ సాధిస్తుందా’ అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమా అని ఆయన సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more