యూపీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన బీజేపీకి అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బలమే కాదు, మరోకటి కూడా అదనంగా జత చేరిందిప్పుడు. జూలైలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు పెను ప్రభావమే చూపనుంది. నిజానికి రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా నిలబెట్టి, గెలిపించుకోవాలనేది బీజేపీ కల. కానీ, యూపీఏ ప్రభుత్వ హయాంలలో అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో అది ఇప్పుడు నెరవేరనుంది.
అందుకు సంబంధించిన లెక్కలు ఇలా ఉన్నాయి. పార్లమెంటు మొత్తం ఉభయ సభల సభ్యులు, దేశంలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలు గల ఎలక్టరోల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వీరిలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు. ఇక, ఎమ్మెల్యే ఓటు విలువ ఆయా రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికను బట్టి ఉంటుంది. గరిష్టంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరోల్ కాలేజ్ మొత్తం ఓట్లు 10,98,882 ఉంటాయి.
ఇందులో సగం ఓట్లు అంటే సుమారు 5.49 లక్షల ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు. బీజేపీ ఇప్పటికే 282 లోక్ సభ సభ్యులను, 56 రాజ్యసభ సభ్యులను, 1126 మంది ఎమ్మెల్యేలను (తాజాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాకుండా) కలిగివుంది. ఉత్తరప్రదేశ్ 325, ఉత్తరాఖండ్ 57, మణిపూర్ 21, గోవాలో 13 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఓట్లు 1,03,756.
అంటే తాజా ఫలితాలతో ఒక్క యూపీ నుంచే ఎన్డీయేకు 67,600 ఓట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్ నుంచి 3648 ఓట్లు వచ్చాయి. ఇక, పంజాబ్, గోవా, మణిపూర్లలో బీజేపీకి వచ్చిన సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎవరి మద్దతు లేకుండానే నేరుగా తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకునే అవకాశం బీజేపీకి దక్కింది. మొత్తానికి ఐదు రాష్ట్రాల శాసనసభల్లో బలాబలాలను మార్చడంతో, ఈ ఏడాది జూలైలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కమలం సిద్ధమైపోతుంది.
ఇంకోవైపు రాజ్యసభలో సభ్యులను పెంచుకునేందుకు కూడా పావులు కదుపుతోంది. ఇప్పటిదాకా బీజేపీకి పెద్దల సభలో సరైన బలమే లేదు. ఈ కారణంగానే కీలక బిల్లుల సమయంలో ప్రతిపక్షాలను బతిమాలుకోలేక చాలాసార్లు ఇబ్బందులుకు గురైంది కూడా. ఈ ఆగష్టులో 58 మంది సభ్యులు రిటైర్ అవుతుండగా, అందుకే ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయిపోయింది. ఎలాగైనా సగం స్థానాలు దక్కించుకునేందుకు యత్నాలు మొదలుపెడుతోంది. ఒక్క యూపీ నుంచే 10 మంది సభ్యుల పదవీకాలం ముగుస్తుండగా, అందులో బీఎస్పీ చీఫ్ మాయవతి కూడా ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more