విరాట్ సేన మళ్లీ విఫలయమైంది. అస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టులో అసీస్ బౌలర్ల ఎదుట మళ్లీ మొకరిల్లారు. మరోమారు ఇలాంటి చెత్త ప్రదర్శన ఇవ్వం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినా.. ఆట తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 213/4.. పటిష్టంగా కనిపించిన టీమిండియా.. నాల్గవ రోజు లంచ్ విరామానికి చాపచుట్టేసింది. నాల్గవ రోజు కేవలం 61 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయి బోక్కబోర్లాపడింది. పలితంగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అస్ట్రేలియాకు ఎదుట 188 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.
నాల్గవ రోజు భారత్ కనీసం మరో 100 పరుగుల అధిక్యాన్ని నమోదు చేసి.. ఆ తరువాత అసీస్ ను కంగారెత్తిస్తారని ఆశించిన భారత క్రికెట్ అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. విరాట్ సేన మాత్రం తమ చెత్త ప్రదర్శనను కొనసాగించి భారత అభిమానుల ఆశల్ని నీరుగార్చారు. వరుస వికెట్లు చేజార్చుకుని మరోసారి ఆసీస్ కు తలవంచారు. చివరి ఆరు వికెట్లను 36 పరుగుల వ్యవధిలో కోల్పోయి కంగారుల బౌలింగ్ కు బెంబేలెత్తిపోయారు. హజల్ వుడ్ మొత్తంగా రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో రాణించడం విరాట్ సేన నడ్డివిరిచింది.
భారత్ స్కోరు 238 పరుగుల వద్ద రహానే(52) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో క్రీజ్ లోకి వచ్చిన కరుణ నాయర్ గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో నాయర్ వచ్చే రావడంతోనే బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత పూజారా(92), అశ్విన్(4)లను మూడు బంతుల వ్యవధిలో హజల్ వుడ్ అవుట్ చేసి భారత్ కు షాకిచ్చాడు. కాగా, హజల్ వుడ్ వేసిన తరువాత ఓవర్ లో ఉమేశ్ యాదవ్(1)అవుట్ కావడంతో భారత్ 258 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ ను కోల్పోయింది. చివర్లో సాహా(20 నాటౌట్)తో కలిసి ఇషాంత్ శర్మ (6) కాసేపు ఆసీస్ బౌలింగ్ ను ప్రతిఘటించారు. చివరి వికెట్ గా ఇషాంత్ అవుట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగింసింది. ఆసీస్ బౌలర్లలో హజల్ వుడ్ ఆరు వికెట్లతో రాణించగా, స్టార్క్ , ఓకీఫ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more