ఆస్ట్రేలియాతో పూణే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఎదురైన దారుణ ప్రధర్శనను మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని హామి ఇచ్చిన 24 గంటల లోపు మరో మారు అదే తరహా పరాభవం విరాట్ సేనకు ఎదురైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మినహా టీమిండియాకు చెందిన ఏ ఒక్క అటగాడు కూడా అకట్టుకోలేకపోయాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో అసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత్ జట్టు విలవిల్లాడింది. తన తొలి ఇన్నింగ్స్ లో 71.2 ఓవర్లలో 189 పరుగులకే చాపచుట్టేసింది.ఎనిమిది వికెట్లు సాధించిన లియన్ టీమిండియా పతనాన్ని శాసించాడు.
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ను ఎదుర్కోలేక కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. శనివారం ఆరంభమైన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 189 పరుగులకే అల్ ఔట్ అయ్యింది. దీంతో పర్యాటక జట్టు ముందుకు 190 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒక్క ఇన్నింగ్స్ లో ఎనమిది వికెట్లలో లయన్ కే భారత బ్యాట్స్ మెన్లు సమర్పించుకున్నారు. భారత ఆటగాళ్లలో అభినవ్ ముకుంద్(0), చటేశ్వరా పూజారా(17), విరాట్ కోహ్లి(12), రహానే(17), కరుణ్ నాయర్(26),అశ్విన్(7), వృద్ధిమాన్ సాహా(1) లు పెవిలియన్ కు చేరి తీవ్రంగా నిరాశపరిచారు.
తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్.. ఆ తరువాత రెండో సెషన్ లోపు మరో మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై మూడో సెషన్ ఆదిలో మరో రెండు వికెట్లను చేజార్చుకుంది. ప్రధానంగా అరవై పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను చేజార్చుకోవడంతో భారత్ మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. ఇదిలా ఉంచితే ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాట్ సాగిస్తున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. తొలిటెస్టు కన్నా దారుణ స్కోరుకే పెవిలియన్ కు చేరిన టీమిండియా.. ఈ సారి బెంగుళూరు పిచ్ బాగోలేదని అరోపిస్తారోమోనన్న విమర్శలు కూడా క్రికెట్ అభిమానుల నుంచి వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more