ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కి టైం కలిసి రావటం లేదు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న యత్నాలు ఒక్కోక్కటిగా విఫలమవుతూ వస్తున్నాయి. ఓవైపు తనకు హ్యాండిచ్చి టీడీపీలో చేరిన 21 మంది జంపర్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోడెలకు బహిరంగ లేఖ రాసిన జగన్, తెరవెనుక ప్రయత్నాలు కూడా చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికలను అస్త్రాలుగా చేసుకుని కీలక నేతలను పార్టీకి దూరం చేయాలని ఫ్లాన్ వేశాడు.
ఇందుకోసం కర్నూలు టీడీపీ రాజకీయంలో కల్లోలం రేపేందుకు యత్నించిన జగన్ కు పెద్ద షాకే తగిలింది. శిల్పా-భూమా వర్గాల మధ్య అగాధం పెంచేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు వారిని మరింత దగ్గర చేస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డిని ఈ జిల్లా నుంచి బరిలోకి దించాలని జగన్ నిర్ణయించాడు. అదే సమయంలో టీడీపీకి వైసీపీ నాయకత్వం లోపాయికారీగా ఓ ప్రతిపాదన పంపింది. వెంకటరెడ్డి బావమరిది శివానందరెడ్డికి టికెట్ ఇస్తే వెంకటరెడ్డిని బరి నుంచి తప్పించి, పోటీని ఏకగ్రీవం చేస్తామనేది దాని సారాంశం.
శివానందరెడ్డి కనుక ఎమ్మెల్సీ అయితే భవిష్యత్తులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు అందించారు. తద్వారా కీలక నేత శిల్పా చక్రపాణిరెడ్డికి టికెట్ రాకుండా చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఇప్పటికే భూమా తో పొసగని క్రమంలో, ఒకవేళ టికెట్ రాకుండా చేస్తే శిల్పా సోదరులు చంద్రబాబుపై అలిగి పార్టీని వీడుతారని, తద్వారా టీడీపీని భారీగా దెబ్బ కొట్టోచ్చని వైసీపీ నేతలు అంచనా వేశారు.
కానీ, వైసీపీ ప్రతిపాదనలోని మర్మాన్ని గ్రహించిన చంద్రబాబు.. చక్రపాణిరెడ్డినే పోటీలో నిలుపుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి శిల్పా పోటీని కన్ఫర్మ్ చేశారు. వెంటనే కర్నూలు వెళ్లి అందరినీ కలిసి విషయాన్ని వివరించాలని, సమన్వయం చేయాలని ఆదేశించారు. ఆయన వెంటనే కర్నూలు చేరుకుని భూమా, శిల్పా వర్గీయులను పిలిపించి మాట్లాడారు. వైసీపీ ప్లాన్ వివరించారు. ఆ తర్వాత శిల్పా సోదరులు, భూమా నాగిరెడ్డి, ఆయన బావమరిది ఎస్వీ మోహనరెడ్డి, కుమార్తె అఖిలప్రియ తదితరులంతా కలిసి అచ్చెన్నాయుడు సమక్షంలో కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం ఇదే సమావేశానికి శివానందరెడ్డిని కూడా పిలిపించి మాట్లాడడంతో అపోహలు పటాపంచలయ్యాయి. అలా జగన్ మాస్టర్ ప్లాన్ కు మరోసారి చెక్ పడినట్లయ్యింది.
ఇక తుది అభ్యర్థుల జాబితాను ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.కళావెంకట్రావు ప్రకటించారు. దాని ప్రకారం..
శ్రీకాకుళం : శత్రుచర్ల విజయరామరాజు
తూర్పుగోదావరి : చిక్కాల రామచంద్రరావు
పశ్చిమగోదావరి : అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణరాజు
నెల్లూరు : వాకాటి నారాయణరెడ్డి
కర్నూలు : శిల్పా చక్రపాణిరెడ్డి
చిత్తూరు : రాజసింహులు (దొరబాబు)
అనంతపురం : దీపక్రెడ్డి
కడప : బీటెక్ రవి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more