తన చేష్టలు, స్టేట్ మెంట్లతో తరచూ వార్తల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి హైలెట్ అయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లాలూకు మధ్య ఎంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో తెలిసిందే. మోదీ ఎంట్రీ కారణంగా బీజేపీతో కటీఫ్ తర్వాత ఆ సమయంలో నితీశ్ కు బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది లాలూనే. తాను తిరిగి అఖండ విజయంతో మళ్లీ సీఎం గద్దె ఎక్కానంటే అందుకు ఆర్జేడీ మద్ధతు, లాలూ ప్రోత్సాహాం చాలా ఉందంటూ నితీశ్ తరచూ చెబుతుంటాడు. ఆ చనువుతోనే లాలూను ‘పెద్దన్న’ అని పిలుచుకుంటాడు కూడా.
నితీశ్ అభిమానం అనుమానం లేకపోయినప్పటికీ, తాజాగా జరిగిన ఓ ఉదంతం లాలూకి కూడా నితీశ్ ఎంత ప్రేమో తెలియజేసింది. ఓ కార్యక్రమానికి హాజరైన లాలూ తనకు కేటాయించిన సీటులో కాకుండా తొలుత సీఎం కుర్చీలోనే కూర్చున్నాడు. ఇంతలో నితీశ్ వస్తుండటం గమనించిన నిర్వాహకులు ఆయన్ను లేవాల్సిందిగా సైగా చేశారు. వెంటనే అర్థం చేసుకున్న లాలూ ఏ మాత్రం మొహమాట పడకుండా లేచి పక్కదాంట్లో కూర్చున్నాడు. ఓ సీనియర్ అయి ఉండి కూడా లాలూ వ్యవహరించిన తీరు హుందాగానే కాదు, లాలూపై అభిమానం కూడా చాటుకున్నాడంటూ అక్కడి మీడియా కథనాలు రాసింది.
ఇదిలా ఉంటే కొన్ని వారాల క్రితం గురుగోవింద్ సింగ్ 350 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి లాలూకు కూడా ఆహ్వానం అందించింది. అయితే వారి పక్కన తనకు కుర్చీ కేటాయించకపోవటంతో అవమానభారంగా ఫీలయిన లాలూ బహిరంగంగానే కామెంట్లు చేశాడు కూడా. దీంతో ఆర్జేడీ-జేడీయూ మధ్య గ్యాప్ మొదలైందా? అన్న పుకార్లు రేగాయి.
ఇక నోట్ల రద్దును సోపోర్ట్ చేస్తూ నితీశ్ వ్యాఖ్యలు చేయటం, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే. మరోవైపు పాట్నాలో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ లో లిక్కర్ బ్యాన్ అంశంపై నితీశ్ పై పొగడ్తలు కురిపించాడు. ఈ నేపథ్యంలో వాళ్ల మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more