ముంబై విమానాశ్రయంలో భధ్రతకు ఇవాళ విఘాతం ఏర్పడింది. రన్ వే నుంచి బయలుదేరుతూ టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ ను తెరవడంతో కలకలం రేగింది. 176 మంది ప్రయాణికులతో ఛండీగడ్ కు బయలుదేరిన విమానంలో ప్రయాణికుడి చర్యతో భద్రతపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విమాన సిబ్బంది సమాచారాన్ని వెనువెంటనే పెలైట్ కు అందించడం.. ఆయన విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బందికి దానిన చేరవేయడంతో విమానం సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయింది.
ఇటీవల ఓ ప్రయానికుడు విమానం సుమారుగా 36వేల అడుగుల ఎత్తులో వున్న సమయంలో ఇలాగే ఎమర్జెన్నీ డోర్ ను తీసే ప్రయత్నం చేసి విఫలం కాగా, ముంబఐ విమానాశ్రయంలో టేకాఫ్ కు సిద్దంగా వున్న విమానంలో ఎమర్జెన్సీ డోర్ ను తీసిన ఘటన సంచలనంగా మారింది. దీంతో విమానంలో ప్రయానిస్తున్న ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పైలట్ అందించిన సమాచారం మేరకు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది హుటాహుటిన సదరు ప్రయాణకిడ్ని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. టేకాఫ్ అవుతున్న సమయంలో 12సీ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ఒక్కసారిగా లేచాడని, అనంతరం విమానం ఎమర్జెన్సీ డోర్ ను బలంగా తెరిచాడని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దీంతో 12 ఎ సీటులో కూర్చున్న మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయని, బాధితుడికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అత్యవసర ద్వారం తెరచి అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సీఐఎస్ఎఫ్ అధికారులు పోలీసులకు సమాచారం అందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more