దేశంలోనే అత్యంత పెద్దదైన, అత్యధిక నియోజకవర్గాలు కలిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతకు మరికొన్ని గంటల వ్యవధిలో ఓటింగ్ ప్రారంభం కానుంది. త్రిముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో గెలుపుపై మూడు ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం 15 జిల్లాల్లోని 73 నియోజక వర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్సీ.. కాంగ్రెస్, బీఎస్పీల మధ్య పోటీ నెలకొంది. 2012లో ఇక్కడి నుంచి బీజేపీ 11 సీట్లను గెలుచుకుంది. బీఎస్పీ 23, ఎస్పీ 24, కాంగ్రెస్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. ఈసారి ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సమాజ్ది, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి.
అయితే ఈ ఎన్నికలలో ఎలాగైన తమ సత్తాను చాటుకోవాలని కేంద్రంలోని అధికార బీజేపి ప్రయత్నాలు రచిస్తుంది. కాగా దేశంలో అత్యాచారాలు పెరుగుకుపోతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయని, అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ అందోళన కలిగిస్తుందని కేంద్రమంత్రి ఉమా భారతి అరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్న హాయంలో క్షమించమని నిందితులు వేడుకునేవరకు, బాధితుల ముందు వారికి చిత్రహింసలు పెట్టాలని అన్నారు.
తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచార నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించానని చెప్పారు. 'రేపిస్టులను తల కిందలుగా వేలాడతీసి చిత్రహింసలు పెట్టాలి. గాయాలకు కారం చల్లాలి. ఏడుస్తూ క్షమించమని వేడుకునేవరకు ఇలాగే చేయాలి. ఈ దృశ్యాలను మహిళలు దగ్గర నుంచి చూడాలి' అని ఉమాభారతి అన్నారు. బులంద్షార్ అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనీసం ప్రయత్నించలేదని విమర్శించారు.
గతేడాది ఢిల్లీకి సమీపంలో హైవేపై వెళ్తున్న వాహానాన్ని ఆపి, తల్లీకూతుళ్లపై సామూహిక లైంగికదాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పదేళ్ల క్రితం తాను మధ్యప్రదశే్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రేపిస్టులను పోలీస్ స్టేషన్లో తలకిందులు వేలాడతీసి చిత్రహింసలు పెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించానని, ఆ దృశ్యాలను కిటికీల ద్వారా చూడాలని మహిళలకు చెప్పానని ఉమాభారతి చెప్పారు. ఇందుకు ఓ పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా, రాక్షసులకు మానవహక్కులు ఉండవని, రావణుడిని చంపినట్టు వారి తలలను నరికివేయాలని చెప్పానని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more