తమిళనాట రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రాజకీయ విశ్లేషకు అంచానాలకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి బయలుదేరిన నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠకు తోడు ఎవరు సీఎం అవుతారు.. అన్న సంధిగ్ధత కూడా ప్రజల్లో అంతకంతకూ పెరుగుకుపోతుంది. ఈ నేపథ్యంలో శశికళ క్యాంప్ నుంచి అపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం క్యాంపులోకి సీనియర్ అన్నాడీఎంకే నేత రావడం చర్చనీయాంశంగా మారింది.
దీంతో శశికళ ఎమ్మెల్యేల వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహాబలిపురం కల్పాకంలోని ఓ రిసార్ట్స్లో శశికళకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు క్యాంప్ నుంచి ఎంజీర్ నమ్మినబంటుగా వున్న మదుసూదనన్ అనే సీనియర్ నేత చాకచక్యంగా తప్పించుకుని ఏకంగా పన్నీరు సెల్వం క్యాంపులోకి వచ్చి చేరారు. చిన్న పని ఉందని చెప్పి శశికళ క్యాంపు నుంచి వచ్చి పన్నీరు సెల్వం క్యాంపులో చేరడం.. అప్పటివరకు తన ఫోన్ స్విచాఫ్ చేయడం కూడా తన వ్యూహంలో భాగమేనని చివరకు చెప్పారు.
ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో కలసి మీడియా ముందుకు వచ్చిన మధుసూదనన్ తాను పన్నీరు సెల్వంకు మద్దతు తెలిపేందుకే కలిశానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని రౌడీల చేతుల్లోకి వెళ్లనీయబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలందరిపైనా వుందని అన్నారు. ఈ సందర్భంగా పన్నీరు సెల్వం మాట్లాడుతూ పోయిస్ గార్డెన్ ను అమ్మ స్మృతి భవనంగా మార్చాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే పోయిస్ గార్డెన్ ను అమ్మ మెమొరియల్ గా మారుస్తామన్నారు.
చిన్నమ్మగా కొనసాగుతన్న శశికళ.. అమ్మ జయలలితను వెన్నుపోటు పోడిచిందని అరోపించారు. శశికళ నిజంగానే తన బలాన్ని నిరూపించుకుంటే అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మారుతుందని ఆయన పేర్కోన్నారు. కాగా మధుసూదనన్ చేరికతో శశికళ క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఇంకెంత మంది ఇలాంటి వారున్నారోనని ఆ వర్గంలో కలవరపాటు ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని పన్నీరు వర్గం దీమా వ్యక్తం చేస్తోంది.
ఈ 50 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు హోటల్ నుంచి రహస్యంగా బయటకు వెళ్లి, పన్నీరు వర్గంలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, శశికళ మాత్రం సాయంత్రం 5 గంటలకు చెన్నైలో ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. తన వైపు ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడగట్టుకుని ఆమె గవర్నర్తో సమావేశం అవుతారని సమాచారం. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ను శశికళ కోరనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more