తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ అధికార అన్నా డీఎంకేలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ త్వరలోనే తమిళనాడు నూతన ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. తమిళ రాష్ట్రానికి అమె మూడవ మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. ఇవాళ జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు అమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
పోయెస్ గార్డెన్లో జరిగిన అన్నా డీఎంకే సమావేశంలో పన్నీరు సెల్వం రాజీనామా లేఖను శశికళకు అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి శశికళను పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, అన్నా డీఎంకే ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. దీంతో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు, మూడు రోజుల్లో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం పన్నీరు సెల్వం, శశికళ అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళ సీఎం పీఠంపై కూర్చునేందుకు పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా తన సన్నిహితులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆమె ఆదేశాల మేరకు జయలలితకు సన్నిహితులైన అధికారులు వైదొలిగారు. శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకే ఈ రోజు అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు పన్నీరు సెల్వం నిరాకరిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా రాజీనామా చేసినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more