స్థానిక సంస్థలు పెట్టిన చిచ్చుతో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ తగలబడుతోంది. పలు డిమాండ్లతో రోడ్డెక్కిన నిరసన హింసాత్మకంగా మారింది. వీధుల్లోకి చేరిన ఆందోళనకారులు లూఠీలు చేయటంతోపాటు ఆస్తులను భారీగా తగలబెడుతున్నారు. ముఖ్యంగా రాజధాని కొహిమాలో ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టేశారు. దీమా పూర్ లో పలు వాహనాలకు నిప్పు పెట్టి భారీ నష్టం వాటిల్లేలా చేశారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గత రెండు రోజులుగా ఇక్కడ నిరసనలు జరుగుతున్నప్పటికీ… నిన్న అవి తారా స్థాయికి చేరుకున్నాయి. మహిళల రిజర్వేషన్లను రద్దు చేయటంతోపాటు, ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లతో ప్రస్తుతం అక్కడి ఆందోళనలు ఉదృతంగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు కారణమైన అధికారులను కూడా సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సమస్య ఏంటంటే...
నాగాలాండ్ లో గిరిజన సాంప్రదాయం ప్రకారం రాజకీయాల్లో మహిళలు జోక్యం చేసుకోకూడదు. కానీ, ప్రభుత్వం మాత్రం 33 శాతం రిజర్వేషన్ల ఆధారంగా వారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో సీట్లు కేటాయించింది. దీంతో కొన్ని గిరిజన తెగలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గువాహటి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. రాజ్యాంగంలోని 371(ఏ) ప్రకారం ఏ ప్రభుత్వం కూడా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోకూడదన్న పాయింట్ ను వినిపించాయి. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాలను ప్రారంభించింది. దీంతో ఆయా తెగలు ఆందోళనలు చేపట్టాయి. శుక్రవారం సాయంత్రం లోగా ముఖ్యమంత్రి టీఆర్ జీలియంగ్, మంత్రులంతా రాజీనామా చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నాయి.
ఇక ఆందోళనలు తారాస్థాయికి చేరటంతో గురువారం రాత్రి సుమారు 400 మంది సైనికులు రాజధాని నగరం కోహిమా చుట్టూ మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే మరికొద్ది రోజులు కర్ఫ్యూ కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. మొత్తం 32 స్థానాల్లో పదకొండు స్థానాలకు ఫిబ్రవరి 1న ఎన్నికలు జరిగాయి కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 144 సెక్షన్ విధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more