సామాన్య, మధ్యతరగతివారికి బడ్జెట్ అనుకూలంగా ఉందంటూ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం తుస్సుమనిపించారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు నితీశ్, మమతా బెనర్జీలాంటి వాళ్లు కూడా అంకెలగారడీ తప్ప మరేం లేదంటూ పెదవి విరిచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో హోదా ఇవ్వకుండా, మరోవైపు ప్యాకేజీ విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్న కేంద్రం బడ్జెట్ విషయంలో కూడా పెద్దగా వరాలు ప్రకటించలేదు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని కేంద్రం అడాప్ట్ చేసుకోవడం, రైతులకు టాక్స్ మినహాయింపులు మాత్రం కొంచెం ఊరటనిచ్చే అంశాలు.
ఇక ఇలా బడ్జెట్ ముగిసిందో లేదో అలా రంగంలోకి దిగిన వెంకయ్య నాయుడు ఏపీ వరాలంటూ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. తమ (కేంద్ర ప్రభుత్వం) దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నాడు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చేసి చూపిస్తున్నామన్నాడు. బడ్జెట్ రైతులకు మేలు కలిగించేలా ఉందని, రాజధాని రైతులకు మేలు కలిగేలా పన్ను మినహాయింపు ఇవ్వాలన్న అంశాన్ని సానుకూలంగా పరిశీలించిన అరుణ్జైట్లీ... ఆ విషయాన్ని పొందుపరిచారని చెప్పాడు. తద్వారా నవ్యాంధ్రపై కేంద్రానికి ప్రత్యేకదృష్టి ఉందని మరోసారి రుజువయిందంటూ చెప్పుకొచ్చాడు.
ఇక కేంద్ర బడ్జెట్లో అమరావతి మెట్రోకు రూ.100 కోట్ల కేటాయింపులు గురించి ప్రస్తావించిన ఆయన, పీఐబీ అనుమతి వచ్చాక నిధులు పెరిగే అవకాశం ఉందన్నాడు. ఇక ఆయన వ్యాఖ్యలను చూసిన వారు ఎప్పటిలాగే వెంకయ్య పాతపాటే పాడాడంటూ లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు బడ్జెట్ లో విశాఖపట్టణానికి రైల్వేజోన్ ప్రకటిస్తారని ఆశించామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపాడు. రైల్వే జోన్ ప్రకటించకపోవడం పట్ల నిరాశ చెందామని, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి దీనిపై చర్చిస్తామని ఆయన తెలిపాడు కూడా. ఐటీ రంగానికి కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయకపోవటంపై ఏపీ సీఐఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more