ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మరోసారి రక్తపుటేరు ప్రవహించింది. కీలక నేతలను మట్టుపెట్టిన మల్కన్ గిరి ఎన్ కౌంటర్ కు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకున్నారు. అదను చూసి పోలీసులే లక్ష్యంగా బుధవారం మెరుపుదాడి చేశారు. పోలీసులు(ఓఎస్ఏపీ జవాన్లు) వెళ్తున్న ఓ వ్యాన్ ను పేల్చేయటంతో 7 మంది మృతి చెందారు. వ్యాన్ లో మొత్తం 13 మంది ఉండగా, 11 మంది ఆచూకీ లభ్యం అయ్యింది. కాగా, మరో ఇద్దరు ఏమయ్యారన్నది అర్థం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు.
కోరాపూట్ జిల్లాలోని సుంకి వద్ద ఓ కల్వర్టు కింద బాంబు పెట్టి వ్యాన్ ను పేల్చేశారు. దీంతో వ్యాన్ తునాతునకలైంది. శకలాలు 25 అడుగుల ఎత్తులో చెట్టుపై చిక్కుకోవడం చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో వుందో ఊహించవచ్చు. దుస్తులు, ఆహారం చిందరవందరగా, చెల్లాచెదురుగా పడిపోయాయి. అమాంతం గాల్లోకి లేచిన వ్యాన్ ఓ చెట్టును ఢీ కొట్టి, దగ్గర్లోని లోయలో పడిపోయిందని సాక్షులు చెబుతున్నారు.
జీపులో ప్రయాణించిన 13 మంది సెలక్షన్ లో ఎంపికైనప్పటికీ ఏడాదిగా ఉద్యోగం పొందలేకపోయారు. కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేయడంతో ఇటీవల ఉద్యోగ నియామక ఉత్తర్వులొచ్చాయి. ఈ ఉత్తర్వులతో వీరు పోలీసు జీపులో కోరాఫుట్ నుంచి కటక్కు శిక్షణకు వెళ్తుండగా మావోయి స్టుల దాడికి గురయ్యారు.
అందరికీ తలలకు గాయాలు కాగా, వారిలో 7 మంది ఇప్పటికే మృత్యువాత పడ్డారు. మరి కొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఏమయ్యారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి 26 కావడంతో రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, పేలుడు చీకటి పడిన తరువాత చోటుచేసుకోవడానికి తోడు సంఘటనా స్థలంలో భారీ గొయ్యి ఏర్పడడం, కల్వర్టు కూలిపోవడంతో పారామిలిటరీ బలగాలతో సహాయకచర్యలకు అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక, రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు. సంఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు వందల మంది పోలీసులతో కూంబింగ్ చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more