టాలీవుడ్ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. దర్శకరత్న ఆరోగ్య స్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత చాలా కాలం పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ మధ్యలో అనేక సినీ వేడుకలకు ఆయన హాజరవుతున్నారు. తనకు ఆరోగ్యం సహకరించకున్నా, సినీ రంగంపై తనకున్న మమకారమే తనను ఇక్కడకు రప్పించిందని ఆయన అనేకసార్లు చెప్పాడు కూడా. ముఖ్యంగా చిన్న సినిమాల ప్రోత్సహించటంలో భాగంగా దాసరి పెద్ద చిత్రాలపై సంచలన వ్యాఖ్యలే చేశాడు.
కాగా, దాసరి అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో తెలుగు సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు.ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖులు కోరుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆయన బాగానే ఉన్నారంటూ చెబుతున్నారు. ఈ మధ్యే జయలలిత పై బయోపిక్ తీస్తానంటూ స్వయంగా ఆయనే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ తో తీయబోయే చిత్రం చర్చ దశలో ఉంది.
పరిస్థితి ఇంకా ఆందోళనగానేనా?
దర్శకరత్న దాసరి ఆరోగ్య స్థితిపై ఆస్పత్రి వర్గాలు కాసేపటి క్రితం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దాసరి నారాయణరావు చికిత్సకు స్పందిస్తున్నారని వారు అన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని తెలిపారు. ఇన్ఫెక్షన్ను అదుపు చేయడానికి ఆయనకు కొద్దిసేపట్లో శస్త్రచికిత్స చేయనున్నట్లు చెప్పారు. ఆపరేషన్ తరువాత మరోసారి బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు. మరో రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు.
అయితే కేవలం ఊపిరితిత్తుల సమస్య మాత్రమే కాదని, కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఆయన్ని వెంటాడుతున్నాయని తెలుస్తోంది. డయాలసిస్ చేశామని కూడా వైద్యులు ప్రకటించారు. మరోవైపు ఆయన ఆరోగ్య స్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో సినీనటులు మంచు మోహన్బాబు, జయసుధ ఈ ఉదయం సదరు ఆసుపత్రి వద్దకు చేరుకుని దాసరిని పరామర్శించారు.
మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ... దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా కృతిమ శ్వాస తీసుకుంటున్న దాసరి నారాయణ రావుకి మరికాసేపట్లో వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more