తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్.. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటు తన దేశభక్తితో పాటు ఇటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంపై అందోళనను వ్యక్తం చేస్తూ రూపోందించిన మరో పాటను ఇవాళ విడుదల చేశారు. బ్యాటిల్ అఫ్ అంధ్రా పేరుతో రూపోందిస్తున్న దేశ బచావో అల్బమ్ లోని మరో పాటను విడుదల చేస్తూ హోదాపై నిరసనను తెలిపేందుకు వచ్చిన తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు జోష్ నింపారు.
'ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్', 'జల్లికట్టు', 'జనసేన', 'బ్యాటిల్ ఆఫ్ ఆంధ్రా' ట్యాగ్ లైన్లు పెడుతూ, అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే తన లింకును ఫాలో కావాలని సూచించారు. ఆపై 'ట్రావెలింగ్ సోల్జర్' పాటను భాంగ్రా లడ్డూ మిక్స్ లో ఎర్రంశెట్టి రామకృష్ణ దర్శకత్వం వహించిన పాట లింకును ఉంచారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని ఆయన ఈ రోజు రెండోసారి అనడం గమనార్హం. ‘విభజనకు ముందు పంచభక్ష్యాలతో కూడిన స్పెషల్ స్టేటస్ను ఇస్తామని మాట ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి... అన్ని రాష్ట్రాలకి సాధారణంగా ఇచ్చే నిధులకి.. స్పెషల్ ప్యాకేజీ అని ముసుగు తొడిగి రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెడతారా?’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
అయితే తమకు లడ్డూల మీద కాని, వాటిని తినేవారి మీద కాని, వాటిని అమ్మేవారి మీద కాని చులకన భావం లేదని జనసేనాని స్పష్టం చేస్తూ మరో ట్విట్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో నవ్యాంధ్రకు అన్యాయం చేస్తున్నారని, తమకు కూడా దేశంలో అందరిలాంటి గౌరవమే వుందని, తమకు ఇచ్చిన హామాలను కూడా నెరవేర్చాలన్నారు. అడక్కుండానే పాచిపోయిన లడ్డూలను చేతిలో పెట్టినవారి మీదే తమ అసహనం అని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తించాలని జనసేన పార్టీ కోరుకుంటోందని అన్నారు. అంతేగాక, ‘పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి, పెద్దలు 'రాయపాటి' గారు ఒకసారి ఆలోచించండి..’ అని పవన్ వరుస ట్వీట్లు చేశారు.
అనంతరం ఆయన మరో ట్వీట్ చేస్తూ... ‘ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే మీరు తెలంగాణ యువతకి కోపం తెప్పించి, 'ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు' అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. పదవీ వ్యామోహానికి భావి తరాల భవిష్యత్తుని పాడు చేసే హక్కు మీకు లేదు అని పవన్ చెప్పారు. ‘రాయపాటి గారు స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చెయ్యరు. చేసే వారిని చెయ్యనివ్వరు.. పైగా కష్టపడే రైతుల పచ్చని పొలాల్లో మీ పోలవరం కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్ చేయిస్తారు’ అని పవన్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more