కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పరువు తీసేసిననంత పనిచేశాడు ఓ చార్టెడ్ అకౌంటెంట్. తన వద్ద చొక్కా కొనుక్కోడానికి డబ్బులు లేవన్న తరహాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రవర్తించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. తాజాగా ఘజియాబాద్కు చెందిన చార్జెట్ అకౌంటెంట్ ముఖేశ్ కుమార్ మిట్టల్ వంద రూపాయల డీడీ తీసి చినిగిన కుర్తాను కుట్టించుకోవాలని రాహుల్కు సూచించాడు. ఆ డీడీని స్పీడ్ పోస్ట్ ద్వారా రాహుల్ పేరుతో న్యూఢిల్లీకి పంపించాడు.
రాహుల్ సామాన్యుడిగా జీవనం సాగిస్తున్నారని, పాపం ఆయన వద్ద కుర్తా కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేకపోవడం తనకు ఎంతో బాధ కలిగించదని, ఆ కారణం చేతనే రాహుల్ గాంధీకి డీడీ తీసి పంపాడు. మోదీని విమర్శించినందకు ఉద్దేశపూర్వకంగానే చార్టెడ్ అకౌంటెంట్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాహుల్ కొత్త కుర్తా కొనుక్కోలేరు గానీ, విదేశీ ప్రయాణాలకు ఖర్చును మాత్రం సంతోషంగా భరించగలరని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. తలా ఓ రూపాయి వేసుకుని రాహుల్కు కొత్త కుర్తా కొనిచ్చేందుకు డబ్బు కలెక్ట్ చేద్దామంటూ కొందరు నెటిజన్లు పిలుపునిచ్చారు.
ఇటీవల ఉత్తరాఖండ్ రిషికేష్లో ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరుగుతూ తన చిరిగిన కుర్తా(చొక్కా)ను చూపించిన విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దుపై మోదీని దుయ్యబడుతూ ప్రసంగించిన రాహుల్.. అకస్మాత్తుగా మైక్ నుంచి కొంచెం పక్కకు జరగి చినిగిన తన కుర్తా (చొక్కా)ను అందరికీ చూపించారు. 'నా కుర్తా చినిగిపోయింది. కానీ ప్రధాని మోదీగారి కుర్తా ఎప్పుడూ చినిగినట్లు మనం గుర్తించలేదు. ఎందుకంటే ఆయన కేవలం ధనవంతులతోనే కనిపిస్తారు. అందుకే మోదీజీ ఫొటోలన్నీ సంపన్నులతో దిగినవే ఉంటాయి' అని రాహుల్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more