ఉద్దానం పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ సమస్యలను దశాబ్దాలుగా వున్న ప్రభుత్వం దానిని పరిష్కరించే దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రశ్నించారు. కిడ్నీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్కరాలకు కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి మనుషులు చనిపోతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వారిని బతికించే చర్యలకు ప్రభుత్వం ప్రత్యక నిధులను ఎందుకు కేటాయించలేదని నిలదీశారు.
ఉద్దానం ప్రాంతానికి చెందిన పలవురు డాక్టర్లు, విద్యావేత్తలు కిడ్నీ సమస్యల గురించి పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లినా, కారణాలపై రీసెర్చ్ చేసేందుకు రూ. 20 కోట్లను కూడా కేటాయించలేకపోయారని తెలుసుకున్న ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తానీ విషయాన్ని ఇప్పుడే వింటున్నానని, ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించారు. అనేక విధాలుగా పార్లమెంటుకు వెళ్లి సమస్యను తెలిపినా, ముందడుగు పడలేదని ఆరోపించారు. ప్రజల అరోగ్యాలకు ప్రభుత్వం నిధులను వెచ్చించాలని ఆయన కోరారు.
వందలాది మంది చిన్నారుల అనాధలుగా మారుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే.. రానున్న రోజుల్లో చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి డయాలసిస్ ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారని, అసలు ఈ వ్యాధి ఇక్కడి ప్రజలను పట్టి పీడించడానికి గల కారణాలు ఏంటన్న విషయమై.. పరిశోధన జరపాల్సిన అవశ్యకత వుందన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు. డయాలసిస్ అన్నది చివరి దశలో తీసుకోవాల్సిన చర్య అన్నారు.
కాగా వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి.. వారికి ఉచితంగా ఔషదాలు ఇచ్చే తొలిదశ చర్యలకు ప్రభుత్వాలు ఎందుకు పూనుకోవడం లేదని పవన్ అడిగారు. కిడ్నీ వ్యాధి ఎందుకు ఈ ప్రాంతంలో ప్రబలుతుందో తెలుసుకునేందుకు కేంద్ర రాష్ట్రాలు ఏం చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధి గురించి, ఆ వ్యాధి బారిన పడిన వారి గురించి తనకు తెలుసునని, స్వయంగా తమ పిన్ని భర్త (బాబాయ్) కూడా ఈ వ్యాధిబారిన పడి మరణించారని పవన్ అవేధనతో అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more