అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికార పగ్గాలు అందుకోకుండానే చైనాపై తన వైఖరిని మరోసారి చాటుకున్నారు. అంతర్జాతీయంగా దేశాల మధ్య సయోద్య నెలకొనాల్సిన సమయంలో చైనా చేసిన పనులు అయనకు అగ్రహాన్ని తెప్పించడంతో ఆయన కమ్యూనిస్టు దేశంపై విరుచుకుపడ్డారు. అమెరికా నేవీకి చెందిన డ్రోన్ను చైనా దొంగలించిందని, దానిని చైనా ఉంచేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న అమెరికా నేవీ ఓషనోగ్రాఫీ (సముద్ర అధ్యయన) డ్రోన్ను చైనా యుద్ధనౌక స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నానని, ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చైనా చెప్తుండగా.. ఆ దేశం తీరుపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైనా అమెరికా డ్రోన్ ను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పిన నేపథ్యంలో దానిని మీరే వుంచుకోండని ట్రంప్ నిర్మోహమాటంగా చెప్పారు. అమెరికా బలగాలు కూడా చైనా తిరగిచ్చే ద్రోణిని తీసుకోవద్దని కోరారు. అయితే దొంగతనంగా తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన చైనాను ప్రశ్నించారు.
‘మీరు దొంగలించిన డ్రోన్ మాకు ఏమీ వద్దని మేం చైనాకు చెప్పదలుచుకున్నాం. దానిని మీరే ఉంచుకోండి’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అపారమైన వనరులున్న దక్షిణ చైనా సముద్రం మొత్తం గంపగుత్తగా తనదేనని, ఇందులో ఇతర దేశాలకు ఏమాత్రం హక్కులేదని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్ను చైనా చెప్పాపెట్టకుండా స్వాధీనం చేసుకుంది. తమ డ్రోన్ను ఇలా స్వాధీనం చేసుకోవడం అక్రమమని అమెరికా వాపోతున్నది. ట్రంప్ గతంలోనూ చైనా తీరుపై తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more