దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాల రాజధాని అన్న అప్రతిష్టను మూటగట్టుకోవడానికి మూలకారణమైన గ్యాంగ్ రేపు కేసు నిర్భయ. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు సరిగ్గా నాలుగేళ్ల క్రితం డిసెంబర్ 16న జరిగింది. ఈ అఘాయిత్యాన్ని దేశానికి చెందిన యువత అంతా ఏకమై దారుణ సామూహిక అత్యాచారాన్ని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. షీలాదీక్షిత్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంపై కూడా ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో తమ వ్యతిరేకతను తెలిపారు.
సరిగ్గా ఆ రోజు వస్తుందంటేనే అప్రమత్తంగా వుండాల్సిన పోలీసులు.. నాలుగేళ్లు గడిచిపోయాయి అంటూ ఊపిరి తీసుకుంటున్న తరుణంలో అదే తరహాలోనే మరో ఘాతుకం జరిగింది. ఉద్యగో అన్వేషణలో భాగంగా రాజధాని వలస వచ్చిన ఒక యువతిపై కారు డ్రైవర్ కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాకు చెందిన యువతి ఉద్యోగం కోసం ఢిల్లీకి వలసవచ్చింది. ఉద్యోగ ఇంటర్య్వూలకు హాజరై ఇంటికెళ్లే క్రమంలో ఏయిమ్స్ అస్పత్రి వద్దనున్న బస్టాప్ లో నిల్చోని బస్సుకోసం వేచిచూస్తుంది.
అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారుమీద కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్టిక్కర్ ఉండటంతో ప్రభుత్వానికి చెందిన వాహనమేనన్న భరోసాతో బాధితురాలు కారు ఎక్కింది. రెండు మూడు గంటల పాటు అమెను కారులో ఎక్కించుకుని తిప్పిన కారు డ్రైవర్.. ఆ తరువాత మోతీబాగ్ లోని అతని ఇంటివద్దకు కారును తీసుకెళ్లి అమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. కాగా అతడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాధితురాలు.. పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు.
అయితే నిందితుడు ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కారు డ్రైవర్ అని, అ కారు కూడా కానిస్టేబుల్ దేనని.. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కాదని కూడా పోలీసులు తెలిపారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుడ్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. అటు బాధితురాలని కూడా వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more