ఉన్న ఎమ్మెల్యేల కారెక్కేయటంతో సైకిల్ కి పంక్చర్ పడిపోయిందని గులాబీ నేతలంతా ఎద్దేవా చేస్తున్నప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ బలోపేతానికి గట్టిగానే కృషి చేయటం చూశాం. ఏపీ కార్యాకలాపాలన్నీ అక్కడి నుంచే జరుపుతుండటంతో బోసిపోయిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎడతెరిపి లేకుండా మీటింగ్ లతో హడావుడియే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుండగా, ఇప్పుడు గడువు సమీపించటంతో ఆయనకు కొత్త టెన్షన్ మొదలైంది.
తెలంగాణలో కారు వేగంతో సైకిల్ పోటీపడలేకపోతుందని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న సభ్యత్వాల సంఖ్య కంటే ఈ దఫా సగం కంటే తక్కువగా నమోదు కావటం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో సభ్యత్వాల సంఖ్య 7.94 లక్షల నుంచి 3.7 లక్షలకు పడిపోయింది. నిజాకి సభ్యత్వ నమోదుకు గడుపు మొదటి వారంతోనే ముగిసినప్పటికీ, మరికొన్ని రోజులు పొడిగించింది. అయినా స్పందన లేకపోవటంతో పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యిందన్న విషయం రుజువైందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రేవంత్ మాత్రం పార్టీలో చేరికలు జరుగుతున్నాయంటూ బహిరంగ ప్రకటనలు చేయటం కొసమెరుపు. మరోపక్క నోట్ల రద్దు కూడా దీనిపై పెను ప్రభావం చూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో సూపర్...
ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వం 50 లక్షలు దాటింది. ఆదివారం సాయంత్రం నాటికి టోటల్ గా 50.07 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఏపీలో మొత్తం 60 లక్షల సభ్యత్వాలను నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. సభ్యత్వ నమోదులో గుంటూరు, చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి. ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో ఈ టార్గెట్ చేరుకోవటం పెద్ద కష్టమేం కాదనే చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more