అధికారంలో చేతిలో ఉందని అజమాయిషీ చెలాయించటం, ఎడాపెడా అవినీతితో డబ్బును వెనకేసుకోవటం ఇంతకాలం ఇలాంటి నేతలనే చూస్తూ వస్తున్నాం. అయితే అడపా దడపా నూటికో, కోటికో మచ్చలేని వాళ్లని కూడా చూశామనుకోండి. కానీ, జనం కోసం, తమ రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత మంది నిజంగా పాటుపడుతున్నారో వారి మన సాక్షికే తెలియాలి.
కానీ, ఒక విషయమై కేరళ పబ్లిక్ వర్క్స్ మంత్రి సుధాకరన్ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే, ఆయన్ని ప్రజల మనిషి అని ఎవరైనా అభినందిస్తారు. కేరళలోని కాజకూట్టం-చేర్టాల మధ్య జాతీయ రహదారిని ఇటీవల వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఈ పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. అయితే, అలప్పుజలో తూక్కుకుళం వద్ద ఈ పనులు నిర్వహించాలంటే సదరు అధికారులు కొంచెం జంకారు. ఎందుకంటే, ఆ రాష్ట్ర మంత్రి సుధాకరన్ కు సంబంధించిన ఇల్లు అక్కడే ఉంది.
రోడ్డు విస్తరణ పనుల్లో ఆయన ఇల్లు ధ్వంసమవుతుందని, వెంటనే ప్లాన్ మార్చేసి, రోడ్డుకు అవతల ఉన్న మరో వ్యక్తి ఇల్లును కూల్చేందుక సిద్ధం అయ్యారు. అయితే, అధికారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుధాకరన్ మాత్రం వారి తీరుపై మండిపడ్డాడు. ‘రోడ్డు విస్తరణ పనుల్లో నా ఇల్లు పోయినా ఫర్వాలేదు. కానీ, ప్లాన్ మాత్రం మార్చకండి’ అని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. దీంతో అధికారులు కంగుతిన్నారంట.
తన స్వార్థం కోసం రోడ్డు విస్తరణ పనుల ప్లాన్ మార్చితే కనుక, రోడ్డు అవతలి వైపు ఉండే వ్యక్తి ఆధారం కోల్పోతాడని చెప్పి తన ఇల్లు పోయినా ఫర్వాలేదు ముందుకెళ్లండని ఆదేశించాడంట. దీంతో మంత్రి ఇల్లును కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిజమైన నేతగా ఇప్పుడు ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more