హైదరాబాద్లోని నానక్రామ్గూడలో పెను విషాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద నాలుగు కుటుంబాలకు చెందిన 13 మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు ఓ మహిళ, చిన్నారిని రక్షించారు. బాధిత కూలీలందరూ విజయనగరం, చత్తీస్గఢ్లకు చెందిన వారుగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పైప్ ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నారు. సహాయక చర్యలు రాత్రి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
భవనం కుప్పకూలిన విషయం తెలుసుకున్న మంత్రులు నాయిని నరసింహారావు, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అనుమతి లేకున్నా ఏడంతస్తులు కట్టడంతోపాటు నాసిరకం నిర్మాణం కారణంగానే బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కట్టడానికి అనుమతులు లేవని ఆయన తెలిపారు.
జీహెచ్ఎంసీ కేవలం రెండు అంతస్థుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తే...యజమాని దీనిని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టాడని అన్నారు. అయితే ఇది శల్యపరీక్షకు సమయం కాదని, ముందు శిధిలాల తొలగింపు జరగాలని, ఆ పనులు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. సుమారు నాలుగు కుటుంబాలకు చెందిన 13 మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లా బలిజపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వారని తెలుస్తోందని ఆయన చెప్పారు.
శిధిలాలకింద చిక్కుకున్న తల్లీబిడ్డను రక్షించామన్న ఆనందంలో ఉండగానే ఒక వ్యక్తి మృతదేహం లభించడం అక్కడున్న వారిని కలచివేసింది. బిల్డింగ్ యజమాని ‘గుడుంబా డాన్’ సత్తూ సింగ్ అలియాస్ సత్యనారాయణ చేసిన తప్పిదానికి అన్యాయంగా పద మూడు మంది ప్రమాదంలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈ జూలైలో ఫిల్మ్ నగర్ లో అక్రమంగా నిర్మిస్తున్న ఓ భవనం కుప్పకూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన విషంయ తెలిసిందే. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం, పైగా నిబంధనలు పాటించకపోవటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more