ఆమెకు సాహసాలంటే ప్రాణం. అలాంటిది పక్షం రోజులుగా జాడ లేకుండా పోవటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రాయ్గఢ్ వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆమె ప్రబల్గడ్ పరిసరాల్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజుల తర్వాత ఆమె ప్రబల్గఢ్ కొండ దిగువన శవమై కనిపించారు.
హైదరాబాద్కు చెందిన పర్వతారోహకురాలు రచిత మిస్సింగ్ మిస్టరీ ఇలా విషాదంగా వీడింది. నగరంలోని హైదర్గూడ అవంతినగర్లో నివసించే రచిత గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని నవంబరు 29న ఆమె మామ మహేశ్ గుప్తా కనోడియా, తిరుమలగిరిలో నివసించే ఆమె తండ్రి సజ్జన్ గుప్తాలు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రచిత గత నెల 25న హైదరాబాద్ నుంచి పన్వేల్ చేరుకున్నారు. 29న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. దుబాయ్లో ఉన్న భర్తకు మహారాష్ట్రలోని ప్రబల్గఢ్ కొండ చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపారు.
రచిత గతంలో ఇదే కొండను అధిరోహకుల బృందంతో కలిసి కొంతవరకు అధిరోహించారు. 25న ముంబైకి వెళ్లిన రచిత.. విమానాశ్రయం నుంచి క్యాబ్లో వెళ్లినట్లుగా సీసీ కెమెరా దృశ్యాల ద్వారా గుర్తించారు. క్యాబ్ నంబరు ఆధారంగా ఆ రోజు ఆమె రాయ్ఘడ్ జిల్లా పరిధిలోని పన్వేల్ వెళ్లినట్లుగా వివరాలు సేకరించారు. పన్వేల్లోని పర్వత ప్రాంతాల్లో వెతకగా కుళ్లిపోయిన స్థితిలో రచిత మృతదేహం కనిపించింది. ఈసారి ఒంటరిగా ఎక్కే ప్రయత్నంలో ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.
అయితే సాధారణంగా పర్వతారోహకులు బృందాలుగా ట్రెక్కింగ్ చేస్తారు. ఒంటరిగా వెళ్లినా గైడ్ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే రచిత ఒంటరిగా వెళ్లటం వెనుక ఆంతర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. దీనిపై కుటుంబ సభ్యులు, భర్త కూడా నోరు మెదపకపోవటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more