తెలంగాణ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే మిషన్ కాకతీయకు పెద్ద షాక్ తగిలింది. నిధులు విడుదల చేయటం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ కోసం మన ఊరు మన చెరువు అన్న ట్యాగ్ లైన్ తో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం ట్రిపుల్ ఆర్ (రిపేర్ - రినోవేషన్ - రిస్టోరేషన్) కింద గతేడాది రూ.44.87 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని నిధులు అవసరమని లోక్ సభ ఎంపీ బూర నర్సయ్య లోసభలో లో లేవనెత్తాడు.
అయితే ప్రత్యేక ఆర్థిక సాయం పద్దు కింద నిధులు విడుదల చేయాలన్న ఆయన విజ్నప్తిని కేంద్రం తోసిపుచ్చింది. మిషన్ కాకతీయకు నిధులివ్వలేమని జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్ బాల్యన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చాడు. వచ్చే మూడేళ్లలో మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని నర్సయ్య గుర్తుచేయగా, ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్థికసాయం చేయడం సాధ్యం కాదని సంజీవ్ తెలిపారు.
అంతేకాదు మిషన్ కాకతీయ యాక్సెలెరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) కింద తీసుకురావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు గతేడాదే నిధులను విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా, జనవరి నుంచి మూడో దశ పనులను ప్రారంభించేందుకు టీ సర్కార్ ఇప్పటికే సిద్ధంగా ఉంది.
మరోవైపు నోట్లరద్దు తదనంతర పరిణామాలపై అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రతిష్టంభనను తొలగించాలని టీఆర్ ఎస్ శాసనసభాపక్ష నేత జితేందర్ రెడ్డి విజ్ఞఫ్తి చేశారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదని అమలవుతున్న విధానం తదనంతరం ఏర్పడిన పరిస్థితులపైనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిష్టంభనను తొలగించడానికి మధ్యేమార్గంగా బీజేడీకి చెందిన భర్తృహరి మహతాబ్ వంటివారి ద్వారా ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపి ఏ నిబంధన కింద చర్చ జరపవచ్చో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more