ఓవైపు నోట్ల పంపిణీలో సరిపడా చిల్లర సర్దలేక బ్యాంకులు సైతం చేతులు ఎత్తివేయగా, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మాత్రం ఆ అవసరాలను తీర్చేస్తోంది. ఆదివారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో రోగుల అవసరాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారు రద్దయిన కరెన్సీ నోట్లను తీసుకుని కొత్త నోట్లు పంపిణీ చేశారు కార్యకర్తలు. ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉన్న విశ్రాంతి శాలలో రోగుల కుటుంబ సభ్యులకు రూ.500, రూ.1000 నోట్లకు చిల్లర ఇచ్చి ఆదుకున్నారు. దాదాపు రూ.25 నుంచి రూ.30 వేల వరకు చిన్న నోట్లు పంపిణీ చేశారు.
నోట్లు మార్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. రోగుల బంధువులు భారీగా గుమిగూడటంతో ఆస్పత్రి సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో జనసేన కార్యకర్తలు మళ్లీ వస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్యకర్తలు చేసిన ఈ పనిపై పవన్ కళ్యాణ్ అభినందనలు కురిపించాడు. ఇబ్బందులు పడుతున్న రోగులు, వారి సహాయకులకు అండగా నిలిచిన కార్యకర్తల ప్రయత్నాన్ని ఆయన అభినందించాడు.
నిమ్స్ లో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి సహాయం చేసిన జనసేన అభిమానులకు అభినందనలు అని ట్వీట్ చేశారు. కాగా, సమస్యలపై ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, సాయం చేద్దాం అన్న పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే తాము ఈ పని చేశామని కార్యకర్తలు చెబుతున్నారు.
My wholehearted appreciation to the supporters of 'JanaSena' for their kind support to helpless patients in NIMS. pic.twitter.com/oKrkXjylZe
— Pawan Kalyan (@PawanKalyan) November 29, 2016
I wholeheartedly appreciate the supporters of ' JanaSena' party for standing by helpless patient families in pic.twitter.com/0kTD41dYIg
— Pawan Kalyan (@PawanKalyan) November 29, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more