అవినీతి, నల్లధనాన్ని దేశం నుంచి తరమికోట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చారిత్రక నిర్ణయం తరువాత మీడియాలో అగుపించకుండా పోయిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దాదాపుగా 20 రోజులకు మళ్లీ వార్తల్లో నిలిచారు. అలాఇలా కాకుండా ఏకంగా అటు సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతూ.. ఇటు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇంతకీ కేంద్రమంత్రి చేసిందేమిటీ.. ఆలాంటి చర్యలను సామాన్యులు చేయలేరా..? అంతలా ఎందుకని అమె ట్రెండ్ అవుతున్నారు..?
ఇక మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే.. కేరళ రాజధాని కోయంబత్తూర్ లో ఇషా ఫౌండేషన్ నిర్వహించే ఓ బిజినెస్ లీడర్ షిఫ్ సమీక్షలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో విమానం దిగుతుండగా ఆమె కాలి చెప్పులు తెగిపోయాయి. దీంతో విమానాశ్రయం వద్ద అమె రాకను తెలుసుకుని వేచివున్న మీడియాతో కూడా అమె మాట్లాడటానికి నిరాకరించారు. అయితే అప్పటికీ మీడియాకు విషయం తెలియకపోవడంతో ఊసురుమంటూ వెనుదిరిగారు. ఇలా విమానాశ్రయం నుంచి బయటపడ్డిన స్మృతి ఇరానీ.. ఇక తన అన్వేషణ ప్రారంభించారు.
ఎవరి కోసం అనుకుంటున్నారు. ఖరీదైన చెప్పుల దుకాణం కోసం కాదండీ.. చెప్పులు కుట్టే మోచీ వ్యక్తి కోసం. అమె కొయంబత్తూర్ పట్టణానికి చేరువవుతున్న సందర్భంలో పట్టణ శివార్లలోని పెరూరులో రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించారు. దీంతో కారు ఆపిన ఆమె అతని వద్దకు వెళ్లి చెప్పులు కుట్టించుకున్నారు. ఆయన చెప్పులు కుట్టినంతసేపు ఆమె అతని పక్కనే స్టూలుపై కూర్చున్నారు. చెప్పులు కుట్టడం పూర్తయిన తరువాత ఎంతైందని ఆమె అతనిని అడిగారు. పది రూపాయలని ఆయన చెప్పడంతో అతని చేతిలో 100 రూపాయలు పెట్టారు.
దీంతో మీడియా ఎంట్రీ ఇచ్చింది. చెప్పులు కుట్టిన గణేశ్ అనే వ్యక్తిని మీడియా పలుకరించింది. అయితే అమె ఎవరో తనకు తెలియదని, అమె తన చెప్పులు కుట్టించుకోడానికి వచ్చిందని, అయితే తన వద్ద చిల్లర లేవని, దీంతో తన కష్టానికి ఫలితంగా రావాల్సిన పది రూపాయలకు బదులు వంద రూపాయలను ఇచ్చి వెళ్లిందని గణేశ్ తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె నిరాడంబరమైన వ్యక్తి అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి వీడియోను, ఫోటోలను తమిళనాడు బీజేపి యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు సూర్య ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా వున్న సమయంలో తన కాన్వాయ్ ఓ డాక్డర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అతను మరణించిన తరువాత ఘటనను చూసిన కేంద్రమంత్రి తన కాన్వాయ్ ను మళ్లించి వెళ్లిపోయిందని, మృతుడి సంతానం అభ్యర్థించినా వైద్యుడిని అస్పత్రికి తరలించడానికి విముఖత వ్యక్తం చేసిందన్న అరోపణలు రావడంతో.. అసలు అమెకు మానవత్వం లేదని కూడా అరోపణలు వచ్చాయి. అదే కేంద్రమంత్రి తాజాగా వంద రూపాయంలో బోలెడంత ఫ్రీ పబ్లిసీటి సంపాదించి.. తనలోని నిరాడంబర తత్వాన్ని చాటుకున్నారని ఇప్పుడు నెట్ జనులు ప్రశంసలు కురిసిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more