నవంబర్ 10 2016.. దేశంలోకి ఒక కొత్త నోటు, ప్రస్తుతం దేశంలోనే అత్యంత పెద్ద విలువైన నోటు విడుదలైన రోజు. ఈ నోటు వచ్చి సరిగ్గా పక్షం రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ నోటు దర్శనం కాని వారు దేశంలో 50 శాతానికి పైగానే వున్నారు. దీని తరువాత మరో నోటు కొత్త 500 రూపాయల కరెన్సీ నోటు అదిగో ఇదిగో అని 10 వ తేదీ నుంచి అందరినీ ఊరిస్తున్నా సుమారు పన్నెండు రోజుల తరువాత ఇది కొందరికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీనిని ఇప్పటి వరకు కేవలం 10 శాతం మంది మాత్రమే చూసివుంటారు.
అయితే ఈ కరెన్సీ నోట్లలో గతంలోని కరన్సీ తరహాలోనే భద్రతా ప్రమాణాలను పాటించామని, అంతకు మించి ఏ విధమైన సెక్యూరిటీ ఫీచర్లు లేవని స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర అర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పడంతో.. అది అక్రమార్కుల పాలిట వరంగా పరిణమించింది. దేశంలోని అనేక మంది ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద క్యూ కట్టి పడిగాపులు కాస్తూ.. డబ్బును తీసుకునేందుకు అవస్థలు పడుతుండటాన్ని తమకు కలసివచ్చిన అవకాశంగా మలుచుకునేందుకు అప్పుడే అక్రమార్కులు సిద్దమైపోయారు.
దాయాధి పాకిస్థాన్ మన కోత్త నోట్లను ముద్రించడం అసాధ్యమని, పాక్ వల్ల కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన కేంద్రానికి స్వదేశంలోని అక్రమార్కులే సవాల్ విసురుతూ.. తమ నకిలీ విద్యను ప్రదర్శిస్తున్నారు. రిజర్వు బ్యాంకు కొత్తగా విడుదల చేసిన 2000 రూపాయల నోట్లకు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. హైదరాబాద్లోని ఎల్బీనగర్ పరిసరాల్లో ఈ ముఠాకు చెందిన ఆరుగురు వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన నకిలీ 2వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా చిన్న విలువైన నకిలీ నోట్లను ముద్రించి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ ముఠా.. కొత్త నోట్లపై ప్రజల్లో ఇంకా అవగాహన లేకపోవడం, రాకపోవడం, దీనికి తోడు అదనపు సెక్యూరిటీ ఫీచర్లు ఏమీ లేవని అర్బీఐ అధికారులే స్పష్టం చేయడంతో.. కొత్తగా వచ్చిన కరెన్సీని నోట్ల విలువలో కూడా నకిలీ నోట్లను ముద్రిస్తూ వాటిని చెలామణిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఎనమిది మంది సభ్యులు గల ఈ ముఠాలో అరుగురు పోలీసుల చేతికి చిక్కగా, మరో ఇద్దరు పరారీలో వున్నారని పోలీసులు తెలిపారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more